📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’

AP: కొత్తగా మరో 70 అన్న క్యాంటీన్లు

Author Icon By Anusha
Updated: December 24, 2025 • 1:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(AP) కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామీణ ప్రజలకు శుభవార్త అందించింది. నియోజకవర్గ, మండల కేంద్రాల్లో 70 అన్న క్యాంటీన్లను త్వరలో ప్రారంభించనుంది. పట్టణాల్లో విజయవంతమైన ఈ పథకాన్ని ఇప్పుడు గ్రామాలకు విస్తరిస్తున్నారు. తక్కువ ధరకే రుచికరమైన భోజనం అందించే ఈ క్యాంటీన్లు పేదల ఆకలి తీర్చనున్నాయి. ఇప్పటికే లక్షలాది మందికి ఈ పథకం అండగా నిలిచింది.

Read Also: Jyothi Yarraji: అథ్లెటిక్ జ్యోతికి ప్రభుత్వ సహకారం

(AP) రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఒకేసారి 70 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న క్యాంటీన్ల నిర్మాణ పనులు జనవరి 10లోగా పూర్తి చేయనుండగా, జనవరి 13 నుంచి 15 మధ్య క్యాంటీన్లు ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో 205 అన్న క్యాంటీన్లు ప్రారంభించి కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

AP: 70 more new Anna canteens

మరో 70 క్యాంటీన్లను మంజూరు

వీటిలో రోజూ మూడు పూటలా కలిపి 2 లక్షల మందికిపైగా ప్రజలు భోజనం చేస్తున్నారు. ఉదయం, రాత్రి అల్పాహారం, మధ్యాహ్నం భోజనాన్ని పూటకు రూ.5కే అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యేల విజ్ఞప్తి నేపథ్యంలో ప్రభుత్వం మరో 70 క్యాంటీన్లను మంజూరు చేసింది.

పట్టణాలు, నగరాల్లో కొనసాగుతున్న 205 అన్న క్యాంటీన్ల ద్వారా ఇప్పటి వరకు 7.20 కోట్ల మందికిపైగా పేదలకు ఆహారం అందించారు. వీరిలో 3.16 కోట్ల మంది మధ్యాహ్న భోజనం చేయగా, 2.62 కోట్ల మంది ఉదయం అల్పాహారం, 1.42 కోట్ల మంది రాత్రి అల్పాహారం పొందారు. విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అన్న క్యాంటీన్లకు అత్యధిక స్పందన లభిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anna canteen Coalition Government latest news Rural Development Sankranti gift Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.