📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

AP: రీసైక్లింగ్ పరిశ్రమలకు 40 శాతం రాయితీ

Author Icon By Saritha
Updated: January 23, 2026 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎపి కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్ కృష్ణయ్య

విజయవాడ : ఏపీలో (AP) రీసైక్లింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వరకు ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు (AP Pollution Control Board) చైర్మన్ డాక్టర్ పి. కృష్ణయ్య తెలిపారు. రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన అంతర్జాతీయ మెటల్ రీసైక్లింగ్ కాన్ఫరెన్స్ ఎక్స్ పోకు రాష్ట్రం తరపున డాక్టర్ పి. కృష్ణయ్య పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పలువురు నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం ఏపీ రీసైక్లింగ్ మోడల్ గురించి ఇంకా రాష్ట్ర కొత్త విధానాల గురించి ఆయన ఈటీవీ భారత్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడానికి పరిశ్రమలకు భూమి కేటాయింపులు, పలు రకాల సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తున్నట్లు వివరించారు. ఇంకా ఇది ఒక ముఖ్యమైన అంతర్జాతీయ సమావేశం అని, ఇక్కడ పరిశ్రమలు, సాంకేతికత ఆవిష్కరణలకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించామని వివరించారు.

Read Also: South Central Railway: తెలుగు రాష్ట్రాల మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్

40 percent subsidy for recycling industries

పర్యావరణ పరిరక్షణకు కొత్త దిశ

ఎగ్జిబిషన్ లో జరిగిన సమావేశంలో అధునాతన సాంకేతికతలను(AP) ప్రదర్శించారని ముఖ్యంగా, రీసైక్లింగ్కు సంబంధించిన ఆధునిక సాంకేతికతలు దృష్టిని ఆకర్షించాయని చెప్పారు. ఇటువంటి వేదికలు సాంకేతిక సమాచారాన్ని పంచుకోవడే కాకుండా రాష్ట్రాల తరపున ఒకరి అనుభవాలను మరొకరు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి తోడ్పడతాయని చెప్పారు. రీసైక్లింగ్ అనేది పర్యావరణ అనుకూల ప్రక్రియ అని డాక్టర్ పి. కృష్ణయ్య వివరించారు. వ్యర్థాల నిర్వహణ, వనరుల పునర్వినియోగం పర్యావరణ పరిరక్షణకు ఎలా దోహదపడుతుందనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రాథమిక లక్ష వివరించారు. ఈ సమావేశం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వ్యవస్థీకృత రీసైక్లింగ్ను నిర్ధారించడానికి ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త రీసైక్లింగ్ విధానాన్ని అభివృద్ధి చేసిందని కృష్ణయ్య వెల్లడించారు.

కొత్త రీసైక్లింగ్ విధానం అభివృద్ధి

రీసైక్లింగ్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాలను అనుసరించడం వల్ల వ్యర్థాలను ఎలా వినియోగించుకోవాలో తెలుస్తుందని తద్వారా వాటిని సులభంగా పారవేయడానికి బదులుగా తిరిగి ప్రాసెస్ చేయవచ్చు అని డాక్టర్ కృష్ణయ్య అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం అలాగే విద్యాసంస్థలు, రీసైక్లింగ్ పరిశ్రమల చురుకైన భాగస్వామ్యం ద్వారా ఈ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని తెలిపారు. వ్యర్థాలు కేవలం నిరుపయోగకరంగా ఉండకుండా ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం రెండింటికీ ప్రయోజనకరంగా ఉండేలా చూసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష చెప్పారు. రాష్ట్రాలు, దేశాలను స్థిరమైన అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్లడంలో ఇటువంటి అంతర్జాతీయ సమావేశాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని కృష్ణయ్య అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:




Andhra Pradesh Ap AP Pollution Control Board APCB Latest News in Telugu Recycling Industry Recycling Policy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.