📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

AP: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య కేసులో12 మంది అరెస్ట్

Author Icon By Saritha
Updated: February 5, 2026 • 1:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : కృషా జిల్లా పెనమలూరు మండలం (AP) పోరంకిలోని ఓ జూనియర్ కళాశాల హస్టల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి (Student) ఆత్మహత్య కారణమైన 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పెనమలూరు పోలీస్ స్టేషన్లో గన్నవరం డిఎసిపి చలసాని శ్రీనివాసరావు, పెనమలూరు సిఐ జె వెంకట రమణ ఈ సంఘటనకు సంబంధించిన వివరా లను మీడియాకు తెలిపారు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్య పేట మండలం బంగారుమెట్టకు చెందిన మొల్లి పవన్ కుమార్ (17), తోటి విద్యార్థి హేమంత్ స్నేహంగా ఉండే వారు. గతేడాది డిసెంబరులో వారి మధ్య వివాదం తలె త్తింది. హేమంత్ మంచివాడు కాదని, అతనితో మాట్లాడ వద్దని తోటి విద్యార్థులకు పవన్కుమార్ చెప్పాడు.

Read Also: AP: శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి సరఫరా కలకలం

విద్యార్థుల పేర్లను చేతి పై రాసుకుని ఆత్మహత్య

ఈ నేపథ్యంలో (AP) హేమంత్ తో పటు కళాశాల హాస్టల్కు చెందిన ఆరుగురు విద్యార్థులు జనవరి 5వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో పవన్ కుమార్ రూమ్కు వెళ్లి ఆయనను కొట్టారు. దీన్ని వీడియోతీసి ఇన్స్టాలో పోస్టుచేశారు. జనవరి 30న మళ్లీ దాడి చేసి కొట్టారు. దీంతో మనస్తాపం చెందిన పవన్ కుమార్ జనవరి 31వ తేదీ సాయంత్రం స్టడీ అవర్కు వెళ్లకుండా తనను కొట్టి అవమా నించిన ఆరుగురు విద్యార్థుల పేర్లను తన చేతి మణి కట్టుపై రాసుకుని హాస్టల్ రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కళాశాల ప్రిన్సిపల్ పిచ్చయ్య, ఫ్లోర్ ఇన్ఛార్జి రవీంద్ర, మెస్ బారు హేమంత్, జూనియర్ లెక్చరర్లు రాజేష్, ఆనంద్, కృష్ణ సంఘటన స్థలానికి వెళ్లారు. జరిగిన విషయం బయటకు పొక్కకుండా వారు జాగ్రత్త పడ్డారు. ఆధారాలు లేకుండా చేసారు. ఈ విషయంలో మృతుని సన్నిహితుల ద్వారా విషయం బయటకు పొక్కింది. యాజమాన్యం వారిని బెదిరించింది, అయితే పవన్కుమార్ తల్లిదండ్రులు అతని ఆత్మహత్య ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ క్రమంలో గుట్టురట్టుకావడంతో నిందితులందరిని అదుపులోకి తీసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh police arrests Junior College Latest News in Telugu Penamaluru Mandal Poranki Student suicide Telugu News Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.