పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు

Read Time:  1 min
Anticipatory bail granted to Perni Nani
Anticipatory bail granted to Perni Nani
FONT SIZE
GET APP

అమరావతి: మాజీమంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. నానికి హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. రేషన్‌ బియ్యం మిస్సింగ్‌ కేసులో ఏ6గా ఉన్నారు పేర్ని నాని. మచిలీపట్నం రేషన్‌ బియ్యం మిస్సింగ్‌ వ్యవహారంలో.. మాజీ మంత్రి పేర్ని నానిపై ప్రధానంగా ఆరోపణలు వినిపించాయి. పేర్ని నాని కుటుంబానికి చెందిన మచిలీపట్నంలోని గోదాముల్లో.. రేషన్‌ బియ్యం తగ్గినట్టు అధికారులు గుర్తించారు.

పేర్ని నానికి ముందస్తు బెయిల్

పేర్ని నాని కుటుంబ సభ్యులపై ఆరోపణలు

గోదాము మేనేజర్ మానస్ తేజ బ్యాంక్ ఖాతాలో.. రూ.1.18 కోట్ల నగదు లావాదేవీలను పోలీసులు గుర్తించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించారని ఆరోపణలు వచ్చాయి. రేషన్ బియ్యం నిల్వలు, రవాణాలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు పేర్ని నాని కుటుంబ సభ్యులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు.

నాని పై తొందరపాటు చర్యలొద్దు

పేర్ని నాని ఆదేశాల మేరకే రేషన్ బియ్యం మాయం, లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి.. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పేర్ని నానిని ఏ6గా చేర్చారు. ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండటానికి పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. నాని పై తొందరపాటు చర్యలొద్దని, కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని గతంలో ఆదేశించింది.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.