📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు

Author Icon By sumalatha chinthakayala
Updated: February 27, 2025 • 10:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పలు స్టేషన్లలో మూడు కేసులు నమోదు

అమరావతి: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరాచకాలు, దందాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు భయపడి గత ఐదేళ్లూ మిన్నకుండిపోయిన బాధితులు ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే గన్నవరం నియోజకవర్గంలోని పలు స్టేషన్లలో మూడు కేసులు నమోదు కాగా.. తాజాగా మరో కేసు పెట్టారు. గన్నవరం శివారు మర్లపాలెంలో సుమారు 18 ఎకరాల్లో పానకాల చెరువు ఉంది. ఆ చెరువులోని కొంత భాగాన్ని 15 మంది గ్రామస్థులు గత 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు.

అభివృద్ధి చేస్తామంటూ ఆ భూమిని స్వాధీనం

2023లో అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తన అనుచరులతో కలిసి భూములను ఖాళీ చేయాలని రైతులపై ఒత్తిడి చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ప్రజల ఉపయోగం కోసం చెరువును అభివృద్ధి చేస్తామంటూ ఆ భూమిని స్వాధీనం చేసుకొని.. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా మట్టి తవ్వకాలు జరిపి అమ్ముకున్నారు. చెరువు భూమికి ప్రత్యామ్నాయంగా రైతులకు వేరే చోట భూమి ఇస్తామని తొలుత చెప్పి.. తర్వాత దగా చేశారు. దీనిపై మర్లపాలెం గ్రామానికి చెందిన జాస్తి మురళీకృష్ణ మంగళవారం రాత్రి గన్నవరం పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు ఏ1గా వల్లభనేని వంశీని, ఏ2గా అనగాని రవి, ఏ3గా రంగా, ఏ4గా శేషు, ఏ5గా మేచినేని బాబు పేర్లను చేర్చి కేసు నమోదు చేశారు.

Another case Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Telugu News online Vallabhaneni Vamsi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.