📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Crime News: అనంతపురంలో మరో దారుణ హత్య

Author Icon By Shobha Rani
Updated: June 25, 2025 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనంతపురం (Anantapur) జిల్లాలో వరుస హత్యలతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. నిన్నటికి నిన్న అనంతపురం నగర శివారులో ఒక యువకుడి దారుణ హత్య ఘటన మరువక ముందే, నేడు మరో వ్యక్తి హత్యకు గురికావడం కలకలం రేపుతోంది.
హోటల్ నిర్వహకుడు కుమ్మరి సురేష్
అనంతపురం రూరల్ మండలం, అక్కంపల్లి గ్రామ సమీపంలో కుమ్మరి సురేష్ (Kumari Suresh)అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు సురేష్ తలపై బండరాయితో అత్యంత పాశవికంగా మోది హత్య చేశారు. కంబదూరు ప్రాంతానికి చెందిన సురేష్, గత ఆరేళ్లుగా అనంతపురం (Anantapur) రూరల్ పరిధిలోని రాచానపల్లి వద్ద గల సదాశివ కాలనీలో నివాసం ఉంటున్నాడు. మృతుడు సురేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్కంపల్లి (Akkampally) సమీపంలో ఒక హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
తలపై బండరాయి కొట్టి..
పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం, సురేష్ మంగళవారం అర్ధరాత్రి సమయంలో హోటల్ వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ దారుణం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మార్గమధ్యంలో గుర్తుతెలియని దుండగులు అతడిని అడ్డగించి, తలపై బండరాయితో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో సురేష్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారి రోదనలు మిన్నంటాయి.
కేసు నమోదు, క్లూస్ టీమ్ విచారణ
ఈ హత్య ఘటనపై సమాచారం అందుకున్న అనంతపురం (Anantapur) రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు. హత్యకు గల కారణాలు, హంతకుల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వరుస హత్యలు – భద్రతపై ప్రశ్నలు
కాగా, నిన్న అనంతపురం (Anantapur) నగర శివారులోని బళ్లారి రోడ్డు సమీపంలో శివానంద అనే యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన 24 గంటలు గడవక ముందే మరో హత్య జరగడం జిల్లాలో తీవ్ర భయాందోళనలకు దారితీస్తోంది. వరుస ఘటనలతో ప్రజలు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ హత్యలపై ప్రత్యేక దృష్టి సారించి, నిందితులను త్వరితగతిన పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Kumari Suresh: అనంతపురంలో మరో దారుణ హత్య

కన్నీరుమున్నీరైన బంధువులు
ఈ దారుణ హత్యతో సురేష్ కుటుంబ సభ్యులు గంభీర విషాదంలో మునిగిపోయారు. పిల్లలు తండ్రిని కోల్పోయిన బాధలో విలపిస్తున్నారు. స్థానికులందరూ కుటుంబానికి మద్దతుగా నిలిచారు. ప్రజలు పోలీసులు ఈ రెండు హత్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిందితులను వేగంగా పట్టుకుని కఠిన శిక్ష విధించాలంటున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read Also: Mother Killed: ప్రేమ ముసుగులో పశుత్వం: కన్న తల్లినే హతమార్చిన

AnantapurMurder Another brutal murder BackToBackMurders Breaking News in Telugu CrimeAlert Google news in Anantapur JusticeForSuresh Latest News in Telugu Paper Telugu News StopViolence Telugu News Telugu News online Telugu News Paper Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.