Annamayya District: అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని నీరుగుట్టువారిపల్లిలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాలిక హత్యకు గురైన అనంతరం, ఆమె మృతదేహం నిందితుడు కులవర్ధన్ ఇంట్లోనే ఉండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: AP: బాలికను చంపి డ్రమ్ములో కుక్కిన పక్కింటి అంకుల్
‘పోలీసులు గో బ్యాక్’ నినాదాలు
హత్యకు పాల్పడిన కులవర్ధన్ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పెద్ద ఎత్తున నిందితుడి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ‘పోలీసులు గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు.
పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం
మృతదేహాన్ని బయటకు తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించిన సమయంలో, పోలీసులు వారిని అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. పోలీసులు, స్థానికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: