Annadata Sukhibhava : ఈ నెలలోనే ‘అన్నదాత సుఖీభవ’ డబ్బు జమ!

Read Time:  1 min
Annadata Sukhibhava : ఈ నెలలోనే ‘అన్నదాత సుఖీభవ’ డబ్బు జమ!
FONT SIZE
GET APP

ఏపీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ‘అన్నదాత సుఖీభవ – PM కిసాన్’ (Annadata Sukhibhava) పథకాన్ని జూన్ 20న ప్రారంభించనుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చే రూ.2 వేల PM కిసాన్ రాశికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తొలి విడతగా రూ.5 వేల ఆర్థిక సహాయం చేర్చనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఈ నెల 20న మొత్తం రూ.7 వేల నగదు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది.

45.71 లక్షల రైతు కుటుంబాలు అర్హులు

ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 45.71 లక్షల రైతు కుటుంబాలు అర్హులుగా గుర్తించబడ్డాయి. జూన్‌లో తొలి విడత రాయితీ ఇచ్చిన అనంతరం, రెండో విడత OCTలో, మూడో విడత వచ్చే ఏడాది జనవరిలో ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, PM కిసాన్ కేంద్ర సహాయం జమ తేదీలో మార్పు జరిగితే, రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్న తేదీ కూడా అనుగుణంగా మారే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

నేరుగా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ

రైతుల హక్కులకు భరోసాగా, వ్యవసాయాన్ని పటిష్టం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను అమలు చేస్తోంది. నేరుగా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధంగా సాంకేతిక వ్యవస్థను సిద్ధం చేశారు. పథకంపై ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

Read Also : DSC : ఏపీలో తొలిరోజు డీఎస్సీకి ఎంతమంది హాజరయ్యారంటే?

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.