📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News telugu: Anil Kumar Singhal: ఇఒగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం

Author Icon By Sharanya
Updated: September 10, 2025 • 3:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల: ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో కార్య నిర్వ హణాధి కారిగా ఆత్మస్థైర్యంతో, మొండి పట్టుతో ప్రభుత్వం ఆదేశించిన విషయాలను సమర్దవంతంగా అమలుచేయడంలో ఒక ప్రత్యేకత చాటుకున్న సీనియర్ ఐఎఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ మళ్ళీ ఇఒగా రావడమే ఓ బ్రాండ్గా టిటిడి ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

తొలిసారిగా ఇఒగా 2017లో నియామకం

గతంలో ఆయన ఇఒగా 2017లో నియమితులైన తొలిసారిగా కేంద్రంలోని ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు సిఫార్సుతో టిటిడిలోకి రావడం, ఆయన పనిచేసిన నాలుగుసంవత్సరాల కాలంలో ఉద్యోగుల పక్షపాతిగా… సమస్యల పరిష్కారంలో సున్నితత్త్వంతో వ్యవహరించారనే
చెబుతున్నారు. అప్పటి టిటిడి తిరుమల జెఇఒ కెఎస్ శ్రీనివాసరాజు(JEO KS Srinivasaraju), తిరుపతి జెఇఒ పోలా భాస్కర్ల సహకారంతో సమష్టి కృషితో కొన్ని నిర్ణయాలను అమలు చేయగలిగారు. టిటిడి పాలనలో సుప్రీమ్ అయిన ధర్మకర్తలమండలి చైర్మన్, సభ్యులతో సఖ్యతగా వ్యవహరించి పలు కీలక విషయాలను ముందుకు నడిపించిన సమర్థ అధికారిగా సింఘాల్ పేరుతెచ్చుకున్నాడు. 20195 సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకుల వడీ ంట్లు తగ్గడంతో ఆయా బ్యాంకుల్లో కాలపరిమితి “ముగిసిన డిపాజిట్ల ద్వారా వెంకన్నకు రాబడి తీసుకువచ్చే దిశగా ఆయన ఆలోచనతో కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో నగదు, బంగారు డిపాజిట్ చేయడానికి పథకం రచించారు. అధికవడ్డీరేటు ఇస్తారంటూ ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయించేలా చూశారు.

అయితే చివరకు విమ ర్శలు, ఆరోపణలు వచ్చినా ఒకటిరెండు బ్యాంకుల్లో డిపాజిట్లు చేయించారు. దీనిపై అటు టిటిడి ఉద్యోగులు ఇటు ప్రజలకు ఎక్కడా సమాచార లోపం రానీయకుండా సానుకూల ధోరణితో సింఘాల్ ముందుకు నడిచాడు. 2019 మే నెలలో అప్పట్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారి వైసిపి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదికి పైగా ఆయన ఇఒగా కొనసాగారంటే సింఘాల్ పని తీరు ఏ పాటిదో అర్థమవుతుంది. 2019లోనే టిటిడి తిరుమల ఆలయంతోబాటు అనుబంధ ఆలయాల్లో సుదీర్ఘకాలంగా వయసుభారంతో అర్చకత్వం కొనసాగించిన ప్రధాన అర్చకులతో బాటు అర్చకులను పదిమంది వరకు పదవీ విరమణ చేయించి వారికి బెనిఫిట్స్ ఖాతాల్లో జమచేయించాడు. ఈ విషయంలో మాజీ ప్రధాన అర్చకులు ఏకంగా న్యాయ స్థానాన్ని ఆశ్రయించినా, పలు రకాల ఆరోపణలు చేసినా సింఘాల్ బేఖాతర్ చేశారు. ఆ తరువాత అర్హత, అనుభవం ఉన్న అదే వంశస్థులైన అర్చకులను ప్రధానఅర్చకులుగా నియమించడంలో ఈయన సఫలీకృతులు కాగలిగారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/vijayawada-new-flyover-construction-update/andhra-pradesh/544614/

Anil Kumar Singhal TTD Breaking News latest news Telugu News Tirumala Tirupati Devasthanam TTD EO Appointment TTD Second Phase Reforms

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.