అంగన్వాడీల డిమాండ్లు న్యాయబద్ధమైనవి : షర్మిల

Read Time:  1 min
Anganwadi workers demands are legitimate..YS Sharmila
Anganwadi workers demands are legitimate..YS Sharmila
FONT SIZE
GET APP

అమరావతి: అధికారంలో వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చి.. ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తుంది కూటమి ప్రభుత్వం అని వైస్‌ షర్మిల అన్నారు. మాట తప్పి మోసం చేయడం అంటే ఇదే మరి. తమ గోడు వినిపించాలనుకున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనం. వారి గొంతు నొక్కి, ఆందోళలను అణిచివేయడం కూటమి ప్రభుత్వ నియంత చేష్టలకు పరాకాష్ట. అంగన్వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవి. వెంటనే వారిని పిలిచి ప్రభుత్వం చర్చించాలి.

అంగన్వాడీల డిమాండ్లు న్యాయ బద్ధమైనవి

మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా

అంగన్వాడీలకు నెలకు గౌరవ వేతనం రూ.26వేలు ఇవ్వాలి. తక్షణం గ్రాట్యూటి చెల్లింపు హామీని అమలు చేయాలి. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా పరిగణించాలి. హెల్పర్ల పదోన్నతిపై నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. పెండింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. విధి నిర్వహణలో అంగన్వాడీలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగంతో పాటు మట్టి ఖర్చుల కింద రూ.20వేలు ఇవ్వాలి.

అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై ప్రకటన

వీటితో పాటు ఇతర 12 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై ప్రకటన చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని షర్మిల తెలిపారు. ఎన్నికలకు ముందు ఒకలా.. ఎన్నికలు ముగిసిన తరువాత ఒకలా వ్యవహిరిస్తూ ఆంగన్వాడీలను చంద్రబాబు-పవన్ కల్యాణ్ ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోందంటూ విమర్శించారు. తమ గోడు వినిపించాలనుకుంటోన్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమని షర్మిల ఆరోపించారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.