విజయవాడ: ఏపీ ప్రభుత్వ సరికొత్త ఆలోచనతో నవ చేతన, ఆధార్ శిల పుస్తకాలు అంగన్వాడీ కేంద్రాల్లో (Anganwadi centers) అందుబాటులోకి తీసుకొచ్చింది. పిల్లలను విజ్ఞాన వంతులను (educate children) చేయడంలో తల్లి పాత్ర ముఖ్యమైంది. బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచే అమ్మ బిడ్డతో ఎన్నో అంశాలను పంచుకోవాలి. పసికందులుగా ఉన్నప్పుడే కబుర్లు చెప్పాలి. వారి సృజన వెలుగులోకి తీసుకుని రావాలి.

అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు ఉపయోగపడే కార్యక్రమాలు
ఈ విషయాలను వివరించే నవ చేతన, ఆధార్ శిలపుస్తకాల సహకారంతో గర్భిణీలు, బాలింతలు, ఐదేళ్ల వయస్సు పిల్లలకి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఇవి చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకు, ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయని స్త్రీశిశు సంక్షేమశాఖ (Women and Child Welfare Department) వెల్లడించింది. అంగన్వాడీ (Anganwadi centers) కార్యకర్తలతో పాటు తల్లులు పిల్లలకు ఏయే విషయాలపై అవగాహన కల్పించాలి. పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ పుస్తకాల్లో పొందిపరిచారు. బాల్యంలో పెంపొందించే మనిషికి చిరకాలం అంశాలు ఉంటాయని అనేక అధ్యయనాలు తేటతెల్లం చేశాయి. సమాజంలో బాధ్యత కలిగిన పౌరుడిగా ఒక వ్యక్తిని తీర్చిదిద్దేందుకు చిన్న వయస్సులో చెప్పిన విషయాలు ఎంతో దోహదం చేస్తాయి. చిన్నప్పటి నుంచి పిల్లలకు అనేక విషయాలు తెలియజేసేందుకు అంగన్వాడీలు చాలా ఉపయోగపడుతున్నాయి. అలాంటి అంగన్వాడీ కేంద్రాల ద్వారా తల్లి గర్భంలో పిండంగా ఉండే బిడ్డల నుంచి 5 ఏళ్ల వయస్సు పూర్తయ్యే పిల్లల వరకు ఎంతో విజ్ఞానాన్ని పెంపొందిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Minister Ramprasad: ఆధునిక సాంకేతికతతో రవాణా శాఖను మరింత బలోపేతం చేస్తాం: మంత్రి రాంప్రసాద్