ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం (YCP Govt) లో రాజధాని అమరావతి స్థానంలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం తీవ్రంగా ప్రయత్నించి,విఫలమయ్యారు వైఎస్ జగన్ (YS Jagan). దీంతో గత ఎన్నికల్లో ఊహించని ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమితో వైసీపీ తన రూటునుమార్చింది. వైసీపీకి మూడురాజధానుల ఆలోచన లేదని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణా రెడ్డి తేల్చి చెప్పారు.
జగన్ అమరావతి (Amaravati) నుంచే పరిపాలన సాగిస్తారని సజ్జల అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతుల ప్లాట్స్ అభివృద్ధి చేసి ఇస్తామని ప్రకటించారు. ఖర్చుతగ్గించి ప్రభుత్వంపై భారం తగ్గిస్తూ గుంటూరు-విజయవాడ మధ్య మహా నగర నిర్మాణానికి కృషి చేస్తామని సజ్జల (sajjala ramakrishna reddy) ఈ మేరకు ప్రకటించారు.
ఓటమితో గుణపాఠం
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మూడు రాజధానుల పేరెత్తకుండా జాగ్రత్తపడుతూ వస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అమరావతిని రాజధానిగా ఉంచేందుకు ఆయన ఇష్టపడలేదు. దీంతో మూడు రాజధానుల చర్చను తెరపైకి తీసుకొచ్చారు.దీంతో అమరావతి రైతులు జగన్ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేక రోజులుగా నిరాహార దీక్షలను చేపట్టారు. చివరికి ఆ నినాదమే వైసీపీఓటమికి కారణమని ఆ పార్టీ గుర్తించింది.
దీనితో తన తప్పిదాలను సరిచేసుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తున్నది వైసీపీ పార్టీ. ఇందులోభాగంగానే సరైన సమయంలో రాజధానిపై నిర్ణయం తీసుకుంటామంటూ వైసీపీ నేత బొత్స ప్రకటించారు. అమరావతి విషయంలోచంద్రబాబు సర్కార్ మాజీ సీఎం ను పలుమార్లు ప్రశ్నించడం జరిగింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: