పోటాపోటీగా టిడిపి, బిజెపి శ్రేణుల ఆందోళన
విజయవాడ : కృష్ణా జిల్లా(Andhra Pradesh) కేంద్రం మచిలీపట్నంలో టిడిపి, బిజెపి వర్గాల మధ్య తమ నాయకులు విగ్రహాల విషయంలో వివాదం తలెత్తింది. ఎన్టీఆర్, వాజ్ పేయీ పేర్ల వివాదం తలెత్తింది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉంది. ఇందులో టిడిపి,(TDP) బిజెపి భాగస్వాములుగా ఉన్నాయి. అయితే పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ కు వాజ్ పేయి పేరు పెట్టాలని బిజెపీ నిర్ణయించింది. దీనిపై టిడిపి నేతలు మండిపడుతున్నారు.
Read also: పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు

శంకుస్థాపనను అడ్డుకున్న టిడిపి నేతలు
ఈ ప్రయత్నాలపై ఆగ్రహం(Andhra Pradesh) వ్యక్తం చేస్తూ వారు నిరసనకు దిగారు. మచిలీపట్నంలోని న్యూహౌసింగ్ బోర్డు వద్ద దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహ నిర్మాణానికి తాజాగా స్థానిక బిజెపి నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా వారు అక్కడే ఉన్న ఎన్టీఆర్ సర్కిల్ లో ఆ విగ్రహం తీసేసి వాజ్ పేయ్ విగ్రహం తయారు చేయించి పెట్టాలని భావించారు. ఇందుకోసం వాజ్ పేయ్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపనకు ప్లాన్ చేశారు. దీన్ని చివరి నిమిషంలో టిడిపి నేతలు అడ్డుకున్నారు. రాష్ట్రంలో అధికార టిడిపి, కేంద్రంలో అధికార బిజెపి మధ్య ఇలా విగ్రహాల విషయంలో వివాదం చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. కూటమిలో భాగస్వాములుగా ఉన్న ఇరు పార్టీల మధ్య రాష్ట్రంలో గతంలో ఎక్కడా ఇలాంటి వివాదం చోటు చేసుకోలేదు. కేవలం పార్టీలు, నేతల మధ్య వివాదాలు కాస్తా ఇప్పుడు విగ్రహాల వరకూ రావడంతో బందరులో ఏం జరుగుతుందని ఇరు పార్టీల సీనియర్ నాయకులు తెలుసుకుంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: