Madanapalle Road Accident: ఏపీలో విషాదం: ఇద్దరు యువకుల బలి.. నలుగురికి తీవ్ర గాయాలు

Read Time:  1 min
Madanapalle Road Accident: ఏపీలో విషాదం: వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు విద్యార్థుల మృతి
Madanapalle Road Accident: ఏపీలో విషాదం: వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు విద్యార్థుల మృతి
FONT SIZE
GET APP

Madanapalle Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో వేర్వేరు చోట్ల జరిగిన ఈ రోడ్డు ప్రమాదాలు ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. ముఖ్యంగా సెలవులకు ఇంటికి వస్తున్న విద్యార్థులు మృత్యువాత పడటం కలచివేసింది..కర్ణాటకలో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థులు తమ సొంతూరికి వస్తుండగా జరిగిన ప్రమాదం మదనపల్లి సమీపంలో విషాదాన్ని నింపింది.

Read Also: Moinabad drugs case: రోహిత్ రెడ్డి సహా ముగ్గురు నిందితుల కస్టడీపై సోమవారం తీర్పు

వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్‌లోని చీకబైలుకు చెందిన కుశాల్‌రెడ్డి, భువనేశ్వర్‌ అనే ఇద్దరు యువకులు కర్ణాటకలో ఉండి చదువుకుంటున్నారు. అయితే ఇటీవల స్కూల్‌కి వరుస సెలవులు కావడంతో కర్ణాటకలోని రాయల్పాడు నుంచి సొంతూరు చీకలబైలుకు బైక్‌పనే బయల్దేరారు. వారు అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం సమీపానికి రాగానే వేగంగా దూసుకొచ్చిన ఓ లారి వారి బైక్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

andhra-pradesh-road-accidents-madanapalle-markapuram-deaths-injuries
andhra-pradesh-road-accidents-madanapalle-markapuram-deaths-injuries

Madanapalle Road Accident: కేసు నమోదు

ప్రమాదాన్ని గమనించిన స్థానిక వాహనదారులకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఇదిలా ఉండగా మార్కాపురం జిల్లాలోనూ మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యర్రగొండపాలెం మండలం అనకుంట దగ్గర రెండు కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న సుమారు నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు.ఇక ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని గమనించిన క్రెయిన్ సహాయంతో రోడ్డు అండ్డంగా ఉన్న కార్లను పక్కకు తొలగించారు. ప్రమాదం కారణంగా ఏర్పడిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.