Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనాభా నిర్వహణపై గురువారం ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. రాష్ట్రంలో తగ్గుతున్న జననాల రేటును దృష్టిలో ఉంచుకుని, జనాభా సమతుల్యతను కాపాడేందుకు సరికొత్త ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణపై దృష్టి పెట్టామని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా నిర్వహణ (Population Management) అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.
Read Also: artificial intelligence: కృత్రిమ మేధతో లాభాల పంట!
సంచలన ప్రోత్సాహకాలు: నగదు, ఉచిత విద్య
ముఖ్యమంత్రి ప్రకటించిన ముసాయిదా పాలసీ ప్రకారం.. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనే దంపతులకు ప్రభుత్వం భారీగా లబ్ధి చేకూర్చనుంది.
- నగదు బహుమతి: ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనే తల్లులకు కాన్పు సమయంలో రూ. 25,000 నగదు బహుమతిగా అందజేస్తారు.
- ఉచిత విద్య: ఆ బిడ్డకు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రభుత్వం సంపూర్ణ ఉచిత విద్యను అందిస్తుంది. ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తును మార్చే “గేమ్ ఛేంజర్” అవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఒకప్పుడు కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చామని, ఇప్పుడు జనాభా నిర్వహణ గురించి చర్చిస్తున్నామని అన్నారు. ఇందుకు సంబంధించిన ముసాయిదా పాలసీ రూపొందిస్తున్నట్టు తెలిపిన సీఎం.. నెల రోజుల పాటు చర్చ జరిపి, ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత తుది రూపు ఇస్తామని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: