📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Andhra Pradesh: నోటీసులు ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేశారు.. సీఎం చంద్రబాబు భావోద్వేగం

Author Icon By Anusha
Updated: February 13, 2026 • 3:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడిన ఆయన, వైసీపీ పాలన సమయంలో తనకు జరిగిన అవమానాలను గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.‘2019-24 మధ్య నాలా కన్నీళ్లు పెట్టుకున్నవారెందరో ఉన్నారు. నా జీవితంలో నేనెప్పుడూ కన్నీళ్లు పెట్టుకోలేదు. నోటీసులు ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనను అడ్డుకున్నారు. నాడు మమ్మల్ని అడ్డకున్నవాళ్లు.. ఇవాళ నీతులు చెబుతున్నారు’ అని చంద్రబాబు అన్నారు.

Read Also: Chandrababu: రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం

పెన్షన్ల కోసం ఏటా రూ.34 వేల కోట్లు ఖర్చు

రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తుంటారని.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94 శాతం స్ట్రైక్‌రేట్‌తో తమను గెలిపించారని తెలిపారు. పెన్షన్ల కోసం ఏటా రూ.34 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏదీ లేదని చెప్పుకొచ్చారు.

ఈ ఏడాదిలో 1,000 ఏసీ బస్సులను తీసుకొస్తున్నామన్నారు. 20 నెలల్లో ఇంత చేయగలిగామా.! అని ఆశ్చర్యపోయేలా అందరూ సహకరించారని తెలిపారు. విభజన జరిగడం వల్ల రాష్ట్రానికి కొంత మేర నష్టం వాటిల్లిందని ప్రస్తావించారు. నాడు ఏ వైపూ తాను సపోర్టు చేయకుండా తటస్ధంగా ఉన్నానని వివరించారు. 2014-2019 మధ్య ఏడాదిలోనే అసెంబ్లీ కట్టామని.. ఇక్కడ అసెంబ్లీ రావడానికి కారణం 29వేల మంది రైతులు 33 వేల ఎకారాల భూమిని ఇచ్చారని తెలిపారు. వారికి పైసా కూడా ఇవ్వలేకపోయామన్నారు. అయితే అదే టెంపో కంటిన్యూ అయి ఉంటే రికవర్ అయ్యేవాళ్లమని చెప్పుకొచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AP Assembly Chandrababu Naidu emotional speech latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.