Andhra Pradesh: రాజంపేట జిల్లా కేంద్రం కోసం జాతీయ రహదారి దిగ్బంధం

Read Time:  1 min
Andhra Pradesh
Andhra Pradesh
FONT SIZE
GET APP

రాజంపేట : రాజంపేటను జిల్లా కేంద్రం(Andhra Pradesh) చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి కడప రాజంపేట, రైల్వే కోడూరు, నందలూరు లో జరిగిన బంద్ ఉధృతంగా మారింది. రాజంపేటలో జాతీయ రహదారిని జేఏసీ నేతలు దిగ్బంధం చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాకపోకలు అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఉద్యమకారులకు నచ్చ చెప్పారు. రెండు గంటల తర్వాత రహదారిపై రాకపోకలు సాధ్యమయ్యాయి.

Read also: CM CBN: పల్లెవెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్ వరకు ఎలక్ట్రిక్ బస్సులే..

రైల్వే కోడూరులో కడప రేణిగుంట జాతీయ రహదారి పై ఉద్యమకారులు టైర్లు కాల్చివేసి ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం రాజంపేట, రైల్వే కోడూరు, నందలూరులో ప్రజలు బంద్ పాటించారు. ప్రజలు స్వచ్ఛతంగా సహకరించారు. వ్యాపారులు దుకాణాలు మూసివేసి ఉద్యమంలో పాల్గొన్నారు. తెల్లవారుజామున జేఏఎస్ నేతలు ఆర్టీసీ బస్టాండ్ వద్దకు వెళ్లి గేట్ ముందు బైఠాయించారు. బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మరోవైపు రాజంపేట నియోజక వర్గ జనసేన నేత ఎల్లటూరి శ్రీనివాసరాజు, టిడిపి, బిజెపి, సిపిఐ, సిపిఎం నేతలు బందులో పాల్గొన్నారు.

ఆర్యవైశ్యులు బంద్ సందర్భంగా ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాజంపేట జిల్లా కేంద్రం(Andhra Pradesh) చేయాలని వినతిపత్రం అందజేశారు. మహిళలు ఉద్యమంలో మేము సైతం అంటూ రాజంపేట పాత బస్టాండ్ లో గొబ్బియలు పాడుతూ రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు. నిరాహార దీక్షలో మహిళలు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా జేఏసీనేతలు మాట్లాడుతూ ఇకనైనా కూటమి ప్రభుత్వం స్పందించి రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల మనోభావాలు గుర్తించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు.

రాజంపేట నేతలు బంద్ జెఎసి ్మనారాయణ,పూల భాస్కర్, ఎల్లటూరి శ్రీనివాసరాజు, పట్టుపోగుల ఆదినారాయణ, గీతాంజలి వెంకటరమణ. మహిళా నేతలు శ్రీలతవాణి వర్మ, రైల్వేకోడూరులో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి తాతంశెట్టి శెట్టి నాగేంద్ర, హేమరాజు, రమేష్, పటాన్ మోలా డాక్టర్ సయ్యద్ లు పాల్గొన్నారు

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.