📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

AP: ‘పోలవరం’ సందర్శించిన విదేశీ నిపుణులు.. ప్రాజెక్టు పురోగతిపై పరిశీలన

Author Icon By Rajitha
Updated: January 20, 2026 • 11:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతిని విదేశీ నిపుణుల బృందం సోమవారం పరిశీలించింది. ఉదయం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న విదేశీ నిపుణులు సీన్ హించిబెర్గెర్, డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రాంకో డి సీకోలకు జలవనరుల శాఖ ఇఎన్సికె నరసింహమూర్తి, సిఇకె రామచంద్రరావు, ఎంఇఐఎల్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి స్వాగతం పలికారు. వీరు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో ఆరో విడత పర్యటిస్తున్నారు. వీరి వెంట కేంద్ర జల సంఘంలోని పలు విభాగాల అధికారులు సరబ్జెత్ సింగ్ బక్షి, మనీష్ రాథోర్, గౌరవ్ తివారి, హేమంత్ గౌతమ్, సిఎస్ ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా, రవి అగర్వాల్, సీడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధి వి ఎస్ రామారావు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, డైరెక్టర్ కె శంకర్, ఎన్ఐఆర్ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నైతాని ఉన్నారు.

Read also: Andhra Pradesh: నేడు విశాఖకు రానున్న రాహుల్ గాంధీ

Foreign experts visited Polavaram

నిపుణుల బృందం ఆయా పనులను నిశితంగా పరిశీలించింది

వీరు పోలవరం ప్రాజెక్ట్ గ్యాప్ 1, డి హిల్, గ్యాప్ 2, జి హిల్, ప్రధాన డాం ఎగువ, దిగువ భాగాలు, డి వాల్, డి వాటరింగ్ ఛానల్, రాక్ ఫిల్, క్లే స్టాక్ పురోగతిని పరిశీలించారు. ప్రభుత్వ సలహాదారు ఏం వెంకటేశ్వరరావు, ఇఎన్సికే నరసింహ మూర్తి, సిఇకె రామచంద్రరావు ఎంఇఐ ఎల్ ప్రతినిధులు పనుల పురోగతిని వివరించారు. నిపుణుల బృందం ఆయా పనులను నిశితంగా పరిశీలించింది. తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకుంది. ఆ తరువాత వారు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యి వివిధ అంశాలపై చర్చించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP Projects irrigation news latest news polavaram Polavaram Dam Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.