సామాన్యుడి పౌష్టికాహారంలో కీలకమైన కోడిగుడ్డు ధరలు ప్రస్తుతం రికార్డు స్థాయికి చేరాయి. పౌల్ట్రీ చరిత్రలోనే తొలిసారిగా గుడ్డు ధరలు ఇంత ఎత్తుకు చేరడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో రూ.5 నుంచి రూ.6 వరకు ఉన్న ఒక్కో గుడ్డు ధర, ఇప్పుడు రూ.8కు చేరింది. హోల్సేల్ మార్కెట్లో కూడా ఒక్కో గుడ్డు ధర రూ.7.30కు పైగా పలుకుతుండటం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.
Read also: Tracking Device : లారీలకు ట్రాకింగ్ పరికరం తప్పనిసరి

Egg prices have skyrocketed
తగిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవడమే
ఇటీవల వరకు రూ.160 నుంచి రూ.170 మధ్య ఉన్న 30 గుడ్ల ట్రే ధర, ప్రస్తుతం హోల్సేల్లోనే రూ.210 నుంచి రూ.220 వరకు పెరిగింది. మరోవైపు నాటు కోడిగుడ్లు ఒక్కొక్కటి రూ.15 వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్కు తగిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవడమే ఈ అకస్మాత్తు ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని పౌల్ట్రీ రంగ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సామాన్య కుటుంబాల నెలవారీ ఖర్చుపై అదనపు భారం పడుతోంది.
గతంలో తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సుమారు 8 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరిగేది. అయితే కోళ్ల దాణా, మక్కజొన్న, చేపపొట్టు వంటి ముడిసరుకుల ధరలు భారీగా పెరగడంతో అనేక మంది రైతులు ఫారాల నిర్వహణను నిలిపివేశారు. దీని ప్రభావంగా గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం ఉన్న ధరలు పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్టైమ్ గరిష్ఠమని వ్యాపారులు చెబుతున్నారు. ఉత్పత్తి సాధారణ స్థాయికి వచ్చే వరకు మరో రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: