News Telugu: Andhra Pradesh: AP ఇంటర్ పరీక్షల్లో మార్పులు

Read Time:  1 min
Andhra Pradesh
Andhra Pradesh
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) ఇంటర్ బోర్డు విద్యార్థుల కోసం కొత్త మార్పులను ప్రకటించింది. ఇకపై గణితం రెండు పేపర్ల బదులుగా ఒకే పేపర్‌ 100 మార్కులకు నిర్వహించనుంది. ఇందులో కనీసం 35 మార్కులు సాధిస్తే పాస్‌గా పరిగణిస్తారు. అలాగే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టుల పరీక్షలు ఇకపై 85 మార్కులకు మాత్రమే జరుగుతాయి. ఫస్ట్ ఇయర్‌లో 29 మార్కులు, సెకండ్ ఇయర్‌లో 30 మార్కులు వచ్చినా ఉత్తీర్ణత లభిస్తుంది. ఈ కొత్త పద్ధతి విద్యార్థులపై పరీక్షా ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Read also: NCLT: నేషనల్ కంపెనీ లాజ్ ట్రిబ్యునల్ లో ఉద్యోగాలు – రేపే ఆఖరు తేదీ

Andhra Pradesh

Andhra Pradesh: AP ఇంటర్ పరీక్షల్లో మార్పులు

ఇక ఈ మార్పులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం సెకండ్ ఇయర్‌లో చదువుతున్న విద్యార్థులకు ఇవి వర్తించవు. విద్యాశాఖ ప్రకటన ప్రకారం, ఒక విద్యార్థి మొదటి ప్రయత్నంలో మొత్తం నాలుగు పేపర్లలో 35 శాతం మార్కులు సాధించి, ఒక్కో పేపర్లో కనీసం 30 శాతం మార్కులు తెచ్చుకున్నా పాస్‌గా పరిగణిస్తారు. నూతన విధానం ద్వారా విద్యార్థులు సబ్జెక్టులపై మరింత అవగాహన పెంచుకుని, సమతుల్యమైన సిద్ధతతో పరీక్షలకు హాజరుకావచ్చని అధికారులు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ఇటీవల ఏ మార్పులు చేసింది?
ఇకపై గణితం రెండు పేపర్ల బదులుగా ఒకే పేపర్‌ 100 మార్కులకు నిర్వహించనున్నారు.

గణితంలో పాస్ కావడానికి కనీసం ఎంత మార్కులు కావాలి?
విద్యార్థులు 35 మార్కులు సాధిస్తే పాస్‌గా పరిగణిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.