Andhra Pradesh: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి పాలన ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రశ్నించిన వారి పైన దాడులు జరుపుతూ అరాచక పాలన చేస్తున్నారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చీపురుపల్లి మండలం గొల్లల ములగాం గ్రామంలో మంగళవారం రాత్రి గ్రామ కమిటీల నియామక ప్రక్రియలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హామీల పేరుతో ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. గడిచిన 18 నెలల పాలనలో రాష్ట్రంలో ఒక్క కొత్త పింఛను కూడా ఇవ్వలేదని దీని కారణంగా అర్హులైన ఎంతోమంది లబ్ధిదారులు ఆందోళన గురవుతున్నారని ఆయన అన్నారు.
Read Also: AP: ముగిసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీ
వైసీపీ పాలనలో ప్రతి ఆరు నెలలకు అర్హులైన అలబ్ధిదారులకు కొత్త పింఛను మంజూరు చేసేవారిని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా గ్రామ వాలంటీర్లకు నెలకు పదివేలు జీతం ఇస్తామని చెప్పి వారిని మోసం చేశారని ఆయన. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో తగిన శాస్తి ప్రజలే చేస్తారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బొత్స కుమార్తె బొత్స అనూష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షులు వల్లి రెడ్డి శ్రీనివాస నాయుడు, పార్టీ మండల అధ్యక్షులు మీసాల వరహాల నాయుడు, నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీ కృష్ణ, మండల వైస్ ఎంపీపీ కరిమజ్జి వెంకటరమణమ్మ, మాజీ సర్పంచ్ కరిమజ్జి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: