📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Andhra Pradesh: ఆయుర్వేద పిజి డాక్టర్లు ఇక సర్జరీలు చేసేందుకు వెసులుబాటు

Author Icon By Rajitha
Updated: December 26, 2025 • 10:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో ఆయుర్వేద పిజి డాక్టర్లు సర్జరీలు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. ఆయుర్వేద (Ayurveda) డాక్టర్లు 58 రకాల సర్జరీలను చేయొచ్చు. 2020లో సిసిఐఎం (భారతీయ కేంద్ర వైద్య మండలి) ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ఎపి అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఆయుర్వేద పిజి కోర్సుల్లోనే వారికి శిక్షణ ఇస్తారు. 39 సాధారణ శస్త్ర చికిత్సలు (శల్యతంత్ర), 19 ఇతర విభాగాల శస్త్ర చికిత్సలు (శలాక్యతంత్ర) నేర్పిస్తారు. శిక్షణ పూర్తయ్యాక, అర్హత సాధించిన వైద్యులు ఈ ఆపరేషన్లు చేయవచ్చు. ఎపి ప్రభుత్వం పురాతన భారతీయ వైద్య విధానాలను ఆధునిక చికిత్సలతో అనుసంధానం చేసేదిశగా ఈనిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానం ద్వారా, ఆయుర్వేద వైద్యులకు సర్జరీలు చేయడంలో ప్రక్రియలో శిక్షణ ఇచ్చి.. తగిన గుర్తింపుతో పాటు అనుమతి ఇవ్వనున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఈ విషయంపై అధికారులతో చర్చించారు. ఈ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం 2020లోనే విడుదల చేసిందని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆయుర్వేద వైద్య రంగానికి ఒక ముఖ్యమైన ముందడుగు అన్నారు.

Read also: Chandrababu : చంద్రబాబువన్నీ చిల్లర రాజకీయాలే – కాకాణి కామెంట్స్

Andhra Pradesh

పిజి పూర్తి చేసిన విద్యార్థులు సర్జరీలు స్వతంత్రంగా నిర్వహించొచ్చు

కేంద్రం 2020లో ఆయుర్వేద వైద్యులూ సర్జరీలు చేయొచ్చని.. ఆయుర్వేదంలో పిజి విద్యార్థులకు శస్త్రచికిత్సల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. దీని కోసం పిజి ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ 2016 (ఆయుర్వేద విద్య) రెగ్యులేషన్ కు సవరణలు చేసి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. పిజి పూర్తి చేసిన విద్యార్థులు సర్జరీలు స్వతంత్రంగా నిర్వహించొచ్చు. మంత్రిత్వశాఖ రూ.750 కోట్లతో ఒక ఆసుపత్రిని నిర్మించనుంది. ఎపి ప్రభుత్వం ఆయుష్ ఆప్పత్రి కోసం శాఖమూరు గ్రామంలో 23.127 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూమిని ఏటా కేవలం ఒక రూపాయి లీజుతో 60 సంవత్సరాల పాటు కేటాయించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ చేపడుతోంది. దీని ద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు AYUSH Doctors అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణం కోసం భారీగా నిధులు కేటాయించారు. ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే, రాజధాని ప్రాంత ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ayurveda Surgeons AYUSH Doctors Surgery latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.