ఏపీ (Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అయితే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 6వ తేదీ వరకు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో నిర్ణయించారు. 16 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 14న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
Read Also: Chandrababu Naidu: శ్రీశైలానికి కొత్త రైల్వే లైన్.. ఈ రూట్లోనే
కీలక చర్చలు
ఫిబ్రవరి 17, 18 తేదీల్లో బడ్జెట్పై సుదీర్ఘ చర్చ జరగనుంది. చర్చ అనంతరం 18వ తేదీన ఆర్థిక మంత్రి బడ్జెట్పై సభకు సమాధానం ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి కావడంతో, మరుసటి రోజున అంటే 16వ తేదీన సభకు సెలవు ప్రకటించారు. పరిస్థితులను బట్టి అవసరమైతే సమావేశాలను మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం కూడా ఉందని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలపై ఈ సమావేశాల్లో కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: