ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. ఇప్పటిదాకా ప్రభుత్వ ఉపాధ్యాయులే ఇన్విజిలేషన్ చేస్తుండగా, ఇకపై ప్రైవేటు టీచర్లకూ అవకాశం ఇవ్వనుంది. ఈ ఏడాది నుంచి 25% మంది ప్రైవేటు టీచర్లను తీసుకోనుంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 4 నుంచి 10 రోజులు జవాబు పత్రాల మూల్యాంకనం జరగనుంది.
Read Also: Andhra Pradesh: శాసనసభలో నేటి నుంచి సరికొత్త టెక్నాలజీ
ఆన్లైన్ విధానం
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ టెన్త్ పరీక్షల నిర్వహణపై నిబంధనలు రూపొందించింది. ఈఏడాది నుంచి ఇన్విజిలేటర్ల నియామకానికి ఆటోమేషన్ విధానం తీసుకొస్తోంది. నిబంధనల ప్రకారం ఆన్లైన్ విధానంలోనే ఇన్విజిలేటర్ల బాధ్యతల కేటాయింపు జరుగుతుంది. ఈ ఏడాది నుంచి మూల్యాంకనం కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటుచేయనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: