📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్

Telugu News: Ananthapuram: వార్డెన్ పై కోపంతో విద్యార్థినుల ఆత్మహత్యా

Author Icon By Sushmitha
Updated: December 11, 2025 • 4:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనంతపురం జిల్లాలోని కేఎస్ఆర్ జూనియర్ కాలేజీలో నలుగురు బాలికలు పురుగుమందు (వాస్మోల్) తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నలుగురు విద్యార్థినుల్లో తాడిపత్రి మండలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు కూడా ఉన్నారు.

Read Also:  Ananthapuram: ACB పేరుతో బెదిరింపులు.. నకిలీ ఇన్ఫార్మర్ అరెస్ట్

Ananthapuram Student commits suicide in anger over warden

వార్డెన్ ఫిర్యాదుతో బాలికల భయాందోళన

ఈ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై స్పష్టత లేదు కానీ, వార్డెన్ వసంత విద్యార్థినుల గురించి వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడమే దీనికి దారితీసినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసి, విద్యార్థినులు భయపడిపోయి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఆసుపత్రికి తరలింపు: పరిస్థితి విషమం

విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేసిన విషయం గమనించిన వార్డెన్ వెంటనే వారిని చికిత్స నిమిత్తం అనంతపురం (Ananthapuram) సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికలకు ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం, నలుగురు బాలికల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకుని ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు విద్యార్థినుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భారీగా చేరుకున్నారు. బాలికల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను మాత్రం వెల్లడించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. ఈ ఘటనతో కళాశాలలో ఉన్న మిగతా విద్యార్థినులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anantapur District four girls suicide attempt Google News in Telugu KSR Junior College Latest News in Telugu students fear Tadipatri mandal sisters Telugu News Today Vasumol consumption Warden Vasantha complaint

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.