అనంతపురం : పెన్షనర్ నుంచి లంచం తీసుకుంటూ ఆడిటింగ్ సిబ్బంది ఎసిబికి(Anantapur) పట్టు బడ్డారు. అనంతపురం జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఆడిటింగ్ విభాగంలో సీనియర్ ఆడిటర్ లక్ష్మినారాయణ, అటెండర్ నూర్లు బుధ వారం ఎసిబి అధికారులకు పట్టు బడ్డారు. ఎసిబి డిఎస్పీ సోమన్న తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్లో సీనియర్ అన ‘స్టెంట్గా పనిచేస్తున్న శ్రీనివాసులు మే 31న రిటైర్డ్ అయ్యారు. తన పెన్షన్ ఫైల్ జడ్పి ప్రాంగణంలోని ఆడిటింగ్ విభాగానికి చేరగా ఫైల్ క్లియర్ చేసేందుకు సీనియర్ ఆడిటర్ లక్ష్మినారాయణ రూ.10 వేలు డిమాండ్ చేశారు.
Read also: పోర్టులు, రైల్వేల కనెక్టివిటీ ద్వారా సంపద సృష్టి

దాడిలో పాల్గొన్న ఎసిబి ఎస్ఐలు, సిబ్బంది
తన ఆరోగ్య(health) పరిస్థితిని (Anantapur) వివరించినా లక్ష్మినారాయణ డబ్బు ఇస్తేనే పని జరుగుతుందంటూ డిమాండ్ చేసి చివరకు రూ.8 వేలు చెల్లించాలన్నారు. దీంతో బాధితుడు శ్రీనివాసులు లంచం ఇచ్చేందుకు ఇష్టపడక, తమను సంప్ర దించారన్నారు. మధ్యవర్తుల సమక్షంలో బుధవారం సాయంత్రం బాధితుడు శ్రీనివాసులు లక్ష్మినారాయణకు డబ్బు ఇచ్చేందుకు వెళ్లగా అటెండర్ నూరు ఇవ్వాలని సూచించాంన్నారు. అటెండర్ నూర్ తీసుకుని సీనియర్ ఆడిటర్ లక్ష్మినారాయణకు అందజేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఇద్దరిని పట్టుకున్నా మన్నారు. నిందితులను విచారణ అనంతరం ఎసిబి కోర్టుకు హాజరు పరుస్తామని ఆయన పేర్కొన్నారు. దాడుల్లో ఎసిబి ఎస్ఐలు హమిదాఖాన్, జయమ్మ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: