📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Anakapalli: అనకాపల్లి పయనీర్ లారీలకు భారీ జరిమానా.. కారణం ఇదే!

Author Icon By Anusha
Updated: August 1, 2025 • 12:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనకాపల్లి జిల్లాలో లారీలపై భారీ జరిమానా విధించిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మూడురోజుల క్రితం ఏపీ అసెంబ్లీ స్పీకర్ , అయ్యన్నపాత్రుడు (AyyannaPatrudu) విశాఖపట్నం నుండి నర్సీపట్నం వెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. మార్గమధ్యంలో మాకవరం మండలం రాజుపేట దగ్గర అధిక లోడుతో వెళ్తున్న భారీ లారీలను స్పీకర్ గమనించారు. సాధారణంగా రహదారులపై అనవసరమైన ప్రమాదకర పరిస్థితులు రాకూడదనే ఉద్దేశ్యంతో ఆయన తన వాహనాన్ని ఆపి ఆ లారీలను అడ్డుకున్నారు.తదుపరి విచారణలో ఆ లారీలు రాచపల్లిలో ఉన్న పయనీర్ కంపెనీ (Pioneer Company) కి ముడిసరుకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. రవాణా శాఖ అనుమతించిన పరిమితి కంటే మించి సరుకు లోడ్ చేసుకొని ప్రయాణిస్తున్న ఈ లారీలు రహదారి భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్నాయని స్పీకర్ గుర్తించారు. వెంటనే ఆయన ఈ విషయాన్ని పోలీసులకు, రవాణా శాఖ అధికారులకు తెలియజేశారు.

Anakapalli: అనకాపల్లి పయనీర్ లారీలకు భారీ జరిమానా.. కారణం ఇదే!

జరిమానా

అధికారులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకొని లారీలను తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు.ఈ క్రమంలో పోలీసులు ఏడు లారీలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ లారీలను జరిమానాలు విధించడానికి నర్సీపట్నం రవాణా శాఖ అధికారులకు అప్పగించగా, వారు లారీలను తనిఖీ చేసి, పరిమితికి ముడి సరకును రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో మొత్తం ఏడు లారీలకు రూ.3,92,000 జరిమానా విధించారు. మొత్తం మీద ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీలను ఆపి, ఓవర్‌లోడ్‌ కారణంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా, రోడ్డు, వంతెనలు దెబ్బ తినకుండా చర్య తీసుకున్నారు. తాళ్లపాలెం వంతెన ఇప్పటికే శిథిలావస్థలో ఉందంటున్నారు అయ్యన్నపాత్రుడు. ఇప్పుడు ఈ లారీలు అధిక లోడుతో వెళితే కూలిపోయే ప్రమాదం ఉందంటున్నారు.

అయ్యన్నపాత్రుడు ఏ పదవులు చేపట్టారు?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ (ప్రస్తుత),రాష్ట్రంలో పలు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక,రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం,తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకత్వ బృందంలో కీలక సభ్యుడు.

అయ్యన్నపాత్రుడు ఏ నియోజకవర్గానికి చెందినవారు?

అయ్యన్నపాత్రుడు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన నాయకుడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ttd-auspiciousness-sumangali-money-prepared-with-donor-support-on-august-8/andhra-pradesh/524081/

Anakapalli news Anakapalli traffic news Andhra Pradesh transport department Ayannapatrudu action lorry seized Anakapalli overloaded trucks issue Pioneer lorries fine Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.