పులివెందుల శాసనసభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) పై మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. జగన్ వ్యవహారశైలి, తీరుతెన్నులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మంత్రి, జగన్ మానసిక స్థితి సరిగా లేదని ఎర్రగడ్డ మానసికాసుపత్రి ఆరోగ్య లక్షణాలను జగన్లో చూస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ మాటలు ఉన్మాదపు ప్రతిఫలమా?
ఫ్రస్ట్రేషన్లో జగన్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతున్నారని, “చంపేస్తాం, నరికేస్తాం” అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వైసీపీలోని కొందరు సైకోల చేష్టలను వ్యతిరేకించాల్సింది పోయి, చిరునవ్వుతో స్వాగతిస్తున్నారని అనగాని ఆరోపించారు. నెలకు ఒకరోజు ప్రజల్లోకి వచ్చి నానా బీభత్సం సృష్టించి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు.
తెనాలికి వెళ్లి గంజాయి బ్యాచ్ను పరామర్శించడం, ఏడాది క్రితం చనిపోయిన వారిని ఇప్పుడు పరామర్శించడం వంటి పనులు చేస్తున్నారని, ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. తన వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడి మరణిస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
“యోగాంధ్ర”తో జగన్కి ఉపశమనం కలుగుతుందా?
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ‘యోగాంధ్ర’ పేరుతో చేపట్టిన యోగా ప్రచార కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, మంత్రి అనగాని మాట్లాడుతూ – అల్లర్లు సృష్టించడం మానుకుని యోగాసనాలు వేస్తే మానసిక పరిస్థితి మెరుగుపడుతుందని మంత్రి సూచించారు. అతని మానసిక ఒత్తిడులు కొంతైనా తగ్గుతాయి.
“ఎర్రగడ్డ లక్షణాలు” – రాజకీయ విమర్శా శైలిలో కొత్త కోణం
జగన్ పై “ఎర్రగడ్డ లక్షణాలు కనిపిస్తున్నాయి” అనే వ్యాఖ్య రాజకీయంగా నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. 2024 ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో జగన్ రెడ్డి మానసిక స్థితి దెబ్బతిన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.
విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నాహాలు
చంద్రబాబు నాయుడు సర్కార్ ప్రోత్సహిస్తున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైజాగ్లో ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి గుర్తుచేశారు. జగన్ రెడ్డి ఇప్పటికైనా మించిపోయింది లేదని, వెంటనే యోగాంధ్రలో పాల్గొంటే ఆయన అసహనం కాస్తయినా తగ్గి, ఇలాంటి పిచ్చి చేష్టలు మానుకుంటారని ఆశిస్తున్నట్లు అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
Read also: Kanna Lakshminarayana: పల్నాడులో జగన్ పర్యటనపై ఎమ్మెల్యే కన్నా తీవ్ర విమర్శలు