📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

అమిత్‌షాకు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదు : షర్మిల

Author Icon By sumalatha chinthakayala
Updated: January 18, 2025 • 11:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ చేశారు. పార్లమెంట్‌లో భారతరత్న బీఆర్ అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షాకు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హతలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమిత్ షా టూర్‌ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. అమిత్ షా ఏపీ పర్యటన సందర్భంగా రాష్ట్రంలోని అంబేద్కర్ విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు తెలపాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, కేడర్‌కు పిలుపునిస్తున్నట్లు షర్మిల ఎక్స్ వేదికగా షర్మిల రాసుకొచ్చారు.

Amit Shah is not eligible to enter Andhra: Sharmila

అంబేద్కర్‌పై చేసిన అనుచతి వ్యాఖ్యల పట్ల అమిత్ షా దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలెఉ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాతను అవమానించడమంటే దేశ ద్రోహంతో సమానమని.. నిండు సభలో అంబేద్కర్‌ను హేళన చేస్తూ మాట్లాడిన అమిత్ షా దేశ ద్రోహి అని షర్మిల ఆరోపించారు. దేశ ద్రోహుల వ్యాఖ్యలను ఖండించకుండా, అమిత్ షాను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయకుండా ఆయనకు అతిథి మర్యాదలు చేసే వాళ్లుఎ కూడా ఈ దేశానికి ద్రోహం చేసినట్టేనన్నారు షర్మిల.

అమిత్ షాతో వేదిక పంచుకొనే పార్టీలు, మౌనంగా ఉండే పార్టీలు దేశానికి ద్రోహం చేస్తున్న పార్టీలేనని ఆమె విమర్శించారు. రాష్ట్రంలోని దళిత, బహుజన, ఆదివాసీ, మైనారిటీ ప్రజల మీద గౌరవం ఉంటే కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలు, ప్రతిపక్ష వైసీపీ కేంద్రహోంమంత్రి అమిత్ షాతో బహిరంగ క్షమాపణలు చెప్పించాలని.. కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని షర్మిల రాసుకొచ్చారు.

Amit Shah ap tour BJP congress Google news sharmila

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.