Ambati Rambabu: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో క్రిమినల్ కేసు నమోదైంది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఇతర వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించి భారీ ర్యాలీ నిర్వహించినందుకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును రాజమండ్రి ప్రకాశ్నగర్ సీఐ బాజీలాల్ విచారణ చేస్తున్నారు.
Read Also:Butta Renuka : వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. ఆస్తుల వేలం !

పోలీస్ నోటీసులు పట్టించుకోకుండా ర్యాలీ
వివరాల ప్రకారం, 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న అంబటి రాంబాబు రెండు రోజుల క్రితం బెయిల్పై విడుదలయ్యారు. ఈ నెల 19న రాజమండ్రి నుంచి గుంటూరుకు బయలుదేరే సమయంలో పోలీసులు సెక్షన్ 30 కింద నోటీసులు జారీ చేశారు. నోటీసుల్లో కార్లతో భారీ ఊరేగింపు నిర్వహించవద్దని, రోడ్-కమ్-రైల్వే బ్రిడ్జిపై అధిక వాహనాలతో ప్రయాణించవద్దని స్పష్టం చేశారు. అయినప్పటికీ అంబటి రాంబాబు, జక్కంపూడి రాజా తమ అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున కార్ల ర్యాలీ చేపట్టడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: