Chandrababu : రెండ్రోజుల్లో అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ : చంద్రబాబు ప్రకటన

Read Time:  1 min
Chandrababu : రెండ్రోజుల్లో అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ : చంద్రబాబు ప్రకటన
FONT SIZE
GET APP

పరిశుభ్ర ఇంధనం కోసం గ్రీన్ హైడ్రోజన్‌ (Green hydrogen)పై రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దాలన్న సంకల్పాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రకటించారు. అమరావతిలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం, హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన మౌలిక వనరులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.గ్రీన్ హైడ్రోజన్‌ను అందుబాటులోకి తేవాలంటే నూతన సాంకేతికత అవసరమని సీఎం అన్నారు. విశ్వవిద్యాలయాలు, పరిశోధకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇది గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించేందుకు కీలకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Chandrababu : రెండ్రోజుల్లో అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ : చంద్రబాబు ప్రకటన
Chandrababu : రెండ్రోజుల్లో అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ : చంద్రబాబు ప్రకటన

2070 నాటికి కార్బన్ లేని ఇంధనాలకు దారితీసే దిశలో ముందడుగు

దేశ లక్ష్యాన్ని గుర్తుచేసిన సీఎం, 2070 నాటికి కర్బన్ రహిత భారత్ సాధించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దీనిలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ కీలక పాత్ర పోషించనుందని చెప్పారు. 2030 నాటికి 500 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటన చేశారని గుర్తు చేశారు.ఏపీలో ఇప్పటికే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నంలో ఎన్టీపీసీ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు కూడా త్వరలో మొదలవనుందని తెలిపారు.

రూ.51 వేల కోట్లకు అవగాహనా ఒప్పందాలు

సదస్సులో భాగంగా UKకు చెందిన యమ్నా సంస్థ రూ.16 వేల కోట్లతో నెల్లూరులో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. మరోవైపు, కేఎస్ఎహెచ్ ఇన్ఫ్రా సంస్థ మచిలీపట్నంలో రూ.35 వేల కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్లాంట్లు నిర్మించనుంది. సీఎం సమక్షంలో జరిగిన ఈ ఒప్పందాలు రాష్ట్రానికి కీలక ముందడుగు.

గ్రీన్ హైడ్రోజన్: భవిష్యత్తు ఇంధన గేమ్‌చేంజర్

సాంప్రదాయ ఇంధన వనరుల కారణంగా పెరుగుతున్న కాలుష్యానికి గ్రీన్ హైడ్రోజన్ ఉత్తమ ప్రత్యామ్నాయమని సీఎం చెప్పారు. సామాన్య ప్రజలకు ఇది తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండేలా చూడటమే లక్ష్యమని స్పష్టంచేశారు.

Read Also : India Canada :భారత్‌-కెనడా సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు: రణ్‌ధీర్‌ జైస్వాల్

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.