📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Amaravati: ఓఆర్ఆర్ భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్

Author Icon By Rajitha
Updated: December 26, 2025 • 12:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఒఆర్ఆర్) ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే నాలుగు జిల్లాలకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఓఆర్ఆర్ ప్రాజెక్టు కోసం భూసేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు జిల్లాలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రచురించింది, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు వచ్చే వారం కేంద్రానికి పంపనున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లాకు కూడా గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన జిల్లాల్లోని జాయింట్ కలెక్టర్లు రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరించే పనిని ప్రారంభించారు. రైతులు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలియజేయడానికి ఇది ఒక అవకాశం.

Read also: Tirupati: టీటీడీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్

Amaravati

ఎన్టీఆర్ జిల్లాలో కూడా భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్

రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని చూస్తోంది. ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను (వివరాల ప్రాజెక్టు నివేదిక) కేంద్ర మంత్రివర్గం ఆమోదించేలోపు భూసేకరణ ప్రక్రియను ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సంబంధించి కేంద్రం ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో భూసేకరణ ప్రక్రియ వేగవంతం కానుంది. ఇక్కడి రెవెన్యూ అధికారులు భూముల వివరాలను అందజేశారు. ఈ వివరాలను విబీతి, ఉన్నతాధికారులు పరిశీలించిన తర్వాత, ఎన్టీఆర్ జిల్లాలో కూడా భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఇప్పటికే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన పల్నాడు జిల్లాలో, జాయింట్ కలెక్టర్ భూ యజమానుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. ఏలూరు జిల్లాలో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి,

కృష్ణా, గుంటూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు వచ్చే వారం నోటిఫికేషన్ జారీ చేసి, 21 రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో 140 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. రోడ్డు మార్గం (ఎలైన్మెంట్) ప్రకారం, కొన్ని సర్వే నంబర్లలో మొత్తం భూమిని, మరి కొన్నింటిలో కొంత భాగాన్ని సేకరించాల్సి ఉంటుంది. అయితే, ఆ సర్వే నంబర్లన్నింటినీ గెజిట్లో పేర్కొంటున్నారు. ఈ భూసేకరణ ప్రక్రియలో భూ యజమానులు తమ అభ్యంతరాలను సకాలంలో తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు. జాయింట్ కలెక్టర్లు రైతులు, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చిన పెగ్ మార్కింగ్ చేయిస్తారు. ఈ ప్రక్రియలో జాయింట్ కలెక్టర్లు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. వారికి రాతపూర్వకంగా సమాధానం చెప్పిన తర్వాతే భూమిని కొలవడానికి రంగం సిద్ధం చేస్తారు.

ఏ సర్వే నంబరులో ఎంత భూమి తీసుకోవాలి

భూమిని కొలిచేటప్పుడు, కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గం (ఎలైన్మెంట్) ప్రకారమే చేస్తారు. జీపీఎస్ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, భూమి యొక్క ఖచ్చితమైన స్థానాలను గుర్తిస్తారు. రోడ్డు కోసం 140 మీటర్ల వెడల్పులో, దాని మధ్య భాగం నుంచి ఇరువైపులా 70 మీటర్ల చొప్పున గుర్తులు (పెగ్స్) పెడతారు. ఈ గుర్తులు పెట్టడం వల్ల ఏ సర్వే నంబరులో ఎంత భూమి తీసుకోవాలి, ఆ భూమి వ్యవసాయానికి పనికొచ్చేదా లేక ఎండిన భూమా, అందులో ఏవైనా చెట్లు ఉన్నాయా. ఇళ్లు కట్టుకున్నారా వంటి విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. ఈ వివరాలన్నీ రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు కలిసి ఒక ప్లాన్ గా తయారుచేస్తారు.

ఈ ప్లాన్ సంయుక్త కలెక్టర్ కు ఇస్తారు. సంయుక్త కలెక్టర్లు ఈ ప్లాను భూమిరాశి అనే ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేస్తారు. అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత, కేంద్రం తుది నోటిఫికేషన్ (3డి నోటిఫికేషన్) జారీ చేస్తుంది. కేంద్ర మంత్రివర్గం ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినప్పుడు ఈ నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత, భూమి యజమానులు తమ భూమికి సంబంధించిన పత్రాలు, ఆధారాలు చూపించి, ఆ భూమి తమదేనని నిరూపించుకోవాలి. చివరగా. ఏ సర్వే నంబరులో ఎంత భూమి తీసుకుంటున్నారో, దానికి ఎంత డబ్బు చెల్లిస్తారో నిర్ణయించి, అధికారికంగా అవార్డు (పాస్) చేస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Amaravati ORR latest news ORR Gazette Notification Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.