ఏపీ రాష్ట్ర విభజన అనంతరం 2015లో అమరావతిని( Amaravati Capital) కొత్త రాజధానిగా ప్రకటించిన తర్వాత, అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విస్తృత స్థాయిలో రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించింది. నాలుగేళ్లపాటు అమరావతి అభివృద్ధి వేగంగా కొనసాగింది. అయితే ప్రభుత్వ మార్పు తర్వాత పరిస్థితులు మారాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక, రాజధాని స్థానాన్ని మార్చి మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. కానీ కోర్టు వ్యవహారాల కారణంగా ఆ నిర్ణయం అమలుకాలేదు.
Read Also: Cognizant: విశాఖలో 12 నుంచి కాగ్నిజెంట్ కార్యకలాపాలు
ఈ నేపథ్యంలో ఇటీవల కూటమి ప్రభుత్వం( Amaravati Capital) అధికారంలోకి వచ్చాక, గతంలో అమరావతిని రాజధానిగా అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్లే రాజధాని మార్పు వివాదం ఉత్పన్నమైందని స్పష్టమైంది. దీనితో అమరావతి రైతులు, ప్రజలు ఈసారి గెజిట్ నోటిఫికేషన్ తప్పనిసరిగా ఇవ్వాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై కేంద్రాన్ని ఒత్తిడి చేస్తోంది.
అయితే అమరావతిని ఏపీ రాజధానిగా అధికారికంగా ప్రకటించాలంటే ముందుగా ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014’లో సవరణలు చేయాలి. ఇందులో రాజధాని పేరును స్పష్టంగా పేర్కొనలేదు. అందుకే ఇప్పుడు ఈ చట్టాన్ని సవరించేందుకు కేంద్ర న్యాయశాఖ చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుత శీతాకాల సమావేశాల సమయంలోనే ఈ సవరణ బిల్లును లోక్సభ, రాజ్యసభల్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సవరణ బిల్లు ద్వారా అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేయడమే కాక, భవిష్యత్తులో రాజధాని మార్పు ప్రయత్నాలు పునరావృతం కాకుండా చట్టపరమైన రక్షణ కల్పించడమే లక్ష్యం. న్యాయశాఖ ఆమోదం పొందిన వెంటనే సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. దీంతో త్వరలోనే అమరావతి రాజధాని అంశంపై కేంద్రం నుండి అధికారిక ప్రకటన రానుందని అంచనా.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: