అమరావతి Amaravati నుంచి జాతీయ రహదారికి కనెక్టివిటీ విజయవాడ : ఎపి రాజధాని అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డు (ఇ3)ని జాతీయ రహదారి వరకూ విస్తరించేందుకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎడిసిఎల్) కొత్త ప్రణాళికను రూపొందిస్తోంది. దొండపాడు నుంచి వెంకటపాలెం వరకూ నిర్మించిన ఈ రహదారిని అక్కడ నుండి మణిపాల్ వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిలో కలపనున్నారు. 45వ ప్యాకేజీలో భాగంగా రెండోదశలో సీతానగరం నుండి మణిపాల్ ఆస్పత్రి వరకూ సుమారు రూ.613.30 కోట్లతో దీనిలో 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్లు, బ్రిడ్జ్లు, అండర్పాస్లు నిర్మించనున్నారు. 2024 చివర్లో ప్రభుత్వం ఈ అంచనాలు రూపొందించింది. అయితే ప్రాజెక్టులో స్వల్ప మార్పులతో గతంలో ఉన్న అంచనాలు సవరించేందుకు ప్రభుత్వం జిఓ 1089 విడుదల చేసింది. ఎపిసిఆర్డిఎ అదనపు కమిషనర్ చైర్మన్గానూ, ఎడి సిఎల్ చీఫ్ ఇంజినీరు మెంబర్ కన్వీనర్ గానూ వ్యవహరించే ఈ కమిటీలో ఆర్అండ్బి, పబ్లిక్ హెల్త్, ఎపిసిఆర్డిఎ ఇఎన్సీలు, గుంటూరు ఆర్టిఒ సభ్యు లుగా ఉంటారు.
AP Govt: చిన్నారుల మృతి ఘటనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్

Amaravati
ఎలివేటెడ్ కారిడార్
రెండోదశలో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ పనులకు గతంలో నిర్ణయించిన ధరలు సరిపోవని వాటిని సవరించాలని నిర్ణయించి వెంటనే కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ రోడ్డును సీతానగరం నుండి ఎన్టీఆర్ NTR కట్ట వరకూ ఆధునిక పద్ధతుల్లో వైర్ బ్రిడ్జి, ఎలివేటెడ్ కారిడార్ రూపంలోనూ, మణిపాల్ ఆస్పత్రి వద్ద జాతీయ రహదారికి అండర్పస్ నిర్మించి జాతీయ రహదారిలో ఇంటర్చేంజ్ పద్ధతిలో నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. ఈ ప్లానులో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
అమరావతిలో కొత్త రహదారి ప్రాజెక్ట్ ఏమిటి?
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ (E3) ను జాతీయ రహదారి వరకూ విస్తరించే ప్రాజెక్ట్ ఇది
ఈ రహదారి ఎక్కడి నుంచి ఎక్కడివరకు విస్తరించనున్నారు?
దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు ఉన్న రహదారిని, మణిపాల్ వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిలో కలపనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: