న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్(Akira Nandan) దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో తన పేరుతో ఉన్న నకిలీ అకౌంట్లు, అసభ్యకరమైన ఏఐ (AI) వీడియోల(AI Video Case)పై అకీరా కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Read Also: Chiranjeevi: క్యాస్టింగ్ కౌచ్ పై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు
కోర్టు ఆదేశాలు:
అకీరా నందన్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్), యూట్యూబ్ మరియు ఎక్స్ (ట్విట్టర్) వంటి సోషల్ మీడియా దిగ్గజాలకు నోటీసులు ఇచ్చింది. అకీరా పేరుతో ఉన్న నకిలీ అకౌంట్లను వెంటనే తొలగించాలని, సదరు అకౌంట్లను నిర్వహిస్తున్న వారి IP అడ్రస్ వివరాలను బహిర్గతం చేయాలని కోర్టు స్పష్టం చేసింది.
నేపథ్యం:
ఇటీవల అకీరాపై అసభ్యకరమైన ఏఐ వీడియో రూపొందించిన వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవాలని అకీరా తన పిటిషన్లో కోరారు. హైకోర్టు తాజా నిర్ణయంతో అకీరాకు పెద్ద ఊరట లభించినట్లయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: