Air force rally guntur : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల యువతకు భారత వాయుసేనలో చేరేందుకు గొప్ప అవకాశం లభించింది. Indian Air Force అగ్నివీర్ వాయు నియామకాల కోసం గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్యూ) ప్రాంగణంలో మార్చి 9 నుంచి ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనుంది. ఈ విషయాన్ని జిల్లా అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ ఎయిర్ఫోర్స్ రిక్రూటింగ్ విభాగం అధికారులు వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం, మార్చి 9 మరియు 10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన మహిళా అభ్యర్థులకు ఎంపికలు నిర్వహించబడతాయి. అనంతరం మార్చి 12, 13 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులకు, మార్చి 15, 16 తేదీల్లో తెలంగాణ పురుష అభ్యర్థులకు ర్యాలీ జరుగుతుంది. ఈ నియామకాలకు ముందస్తు ఆన్లైన్ నమోదు అవసరం లేదని, అభ్యర్థులు నేరుగా హాజరుకావచ్చని తెలిపారు.
Read Also: Kerala High Court: కేరళ సీఎంఓపై హైకోర్టు సీరియస్
అవివాహిత యువతీయువకులు మాత్రమే ఈ నియామకాలకు అర్హులు. జూలై 2, 2005 నుంచి జనవరి 2, 2009 మధ్య జన్మించి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. కనీస ఎత్తు 152 సెం.మీ. ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా ముందుగా శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించి, అర్హులైన వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు.
ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు అవసరమైన పత్రాల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య రిపోర్ట్ చేయాలని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: