విజయవాడ: పాత్రికేయులు, సాధారణ అభ్యర్థుల కోసం సి. ఆర్. మీడియా అకాడమి 2023- 24 సంవత్సరంలో నిర్వహించిన “జర్నలిజం డిప్లొమా కోర్సు” (Journalism Diploma Course) సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తమ అభ్యర్ధన మేరకు అంగీకరించిందని చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

గతంలో కోర్సులో నమోదై, పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించలేని (Unable to pass exams) అభ్యర్థులకు మాత్రమే ఈ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారని ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. గతంలో నిర్వహించిన నాలుగు పేపర్లకు పత్రికలకు రాయడం, ఎలక్ట్రానిక్ మీడియా నైపుణ్యాలు, కొత్త మీడియా, మీడియా చట్టాలు నైతికాంశాలు పేపర్లుకు సంబంధించి ఆగస్టు 11 నుంచి 14 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కాగోరే అభ్యర్థులు యూనివర్సిటీ ( www.anu.ac.in ) వెబ్ సైట్లో ఈ నెల 20 వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాల్సి వుంటుందని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది 31-07-25 రూ.100 అపరాధ రుసుముతో 02.08.25 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం యూనివర్సి టీ కల్పించిందని తెలిపారు. పరీక్ష రుసుము వెయ్యి రూపాయలు అభ్యర్థులు యూనివర్సిటీకి చెల్లించాల్సి వుంటుందన్నారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Kapila Tirtham: కపిలతీర్థం ఆలయం దర్శించుకోనున్నసిఎం చంద్రబాబు