తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనంతో ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతుందని రాష్ట్రగవర్నర్ (Governor) అబ్దుల్ నజీర్ (Abdul Nazir) తెలిపారు. గవర్నర్ దంపతులు తిరుమలకు చేరుకున్నారు. ఉదయం నైవేద్యవిరామ సమయంలో గవర్నర్ దంపతులు మహద్వారం వద్దకు రావడంతో టిటిడి చైర్మన్ బిఆరా నాయుడు స్వయంగా స్వాగతం పలికారు.

ఆలయ ఇఒ శ్యామలరావు, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి (Venkaiah Chowdhury) స్వాగతం పలికారు. ఆలయంలోనికి చేరుకున్న జస్టీస్ అబ్దుల్ నజీర్ (Abdul Nazir) దంపతులు శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులందుకున్నారు. వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి ఇఒ శ్యామలరావు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గవర్నర్ శ్రీవారిని దర్శించుకుని తిరుగుప్రయాణ మయ్యారు. అంతకుముందు ఉదయం శేషాద్రి ఎక్స్ ప్రెస్ రైల్లో తిరుపతికి విచ్చేసిన గవర్నర్ జస్టీస్ నజీర్ దంపతులకు తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభంబన్సల్, జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు పుష్పగుచ్ఛాలతో సాదర స్వాగతం పలికారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: N. Madhav: మోడీ పాలనలో నాల్గవ ఆర్థిక శక్తిగా భారత్: పి.వి, ఎన్.మాధవ్