వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గుంటూరులో చోటుచేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో ఆయనపై ఏకకాలంలో మూడు కేసులు నమోదవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, విధుల్లో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం వంటి అభియోగాలపై పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. నిన్నటి ఉద్రిక్తతల అనంతరం అంబటిని పోలీసులు అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
HYD : హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..ఇందులో విశేషాలు మాములుగా లేవు !!
అంబటిపై నమోదైన మూడు కేసుల వివరాలు పరిశీలిస్తే:
మొదటి కేసు: గుంటూరులోని నల్లపాడు పిఎస్లో పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు మేరకు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించారన్నది దీని సారాంశం.
రెండవ కేసు: విధుల్లో ఉన్న ఎస్ఐ రామకృష్ణపై దురుసుగా ప్రవర్తించారని అదే స్టేషన్లో మరో కేసు నమోదైంది. రోడ్డుపై కారు పార్కింగ్ విషయంలో అడ్డుకున్నందుకు పోలీసులను నెట్టేయడం, విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం వంటి సెక్షన్ల కింద ఈ కేసు ఫైల్ చేశారు.
మూడవ కేసు: పల్నాడు జిల్లా నకరికల్లులో టీడీపీ నేత బాజీ ఫిర్యాదుతో నమోదైంది. సోషల్ మీడియా వేదికగా లేదా బహిరంగంగా ముఖ్యమంత్రిని కించపరిచేలా మాట్లాడారన్నది ఫిర్యాదుదారుడి ఆరోపణ.
ఈ పరిణామాల నేపథ్యంలో అంబటి రాంబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిని ముట్టడించగా, పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఆయన్ను అరెస్ట్ చేశారు. మరోవైపు, ఈ అరెస్టును రాజకీయ కక్ష సాధింపుగా వైసీపీ అభివర్ణిస్తోంది. అంబటి సతీమణి విజయలక్ష్మి ఇప్పటికే హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తూ, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ప్రభుత్వం విమర్శలను తట్టుకోలేక అక్రమ కేసులు పెడుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com