📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

ఆర్నెల్లలోనే 60 వేల మెట్రిక్ టన్నులు బియ్యం సీజ్: నాదెండ్ల

Author Icon By sumalatha chinthakayala
Updated: April 2, 2025 • 4:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం రేషన్ బియ్యం విషయంలో ఆర్గనైజ్డ్ మాఫియాను తయారుచేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో 76,854 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేస్తే….. కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేసిందని చెప్పారు. అంతేకాకుండా వారిపై క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ ఉపయోగించడం జరిగిందని తెలిపారు.

వీరిపై క్రిమినల్ కేసులు నమోదు

రాష్ట్రంలో 2019-2024 మధ్య పౌరసరఫరాల దాడులలో 76,854 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ అరెస్ట్ అయిన వారి సంఖ్య 9,664 మంది. ఇందులో 148 మందిని రెండుసార్లు కంటే ఎక్కువ పర్యాయాలు అరెస్ట్ చేశారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయి. బియ్యంతో పాటు 512 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. కాకినాడలో 50 వేల మెట్రిక్ టన్నులు బియ్యం జప్తు చేశారు. ఇందులో 25 వేల 386 మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యంగా గుర్తించారు. 13 సంస్థలపై కేసు నమోదైంది. క్షేత్రస్థాయిలో ఇప్పటికీ రేషన్ బియ్యం కోసం ఎదురుచూసే వాళ్లు ఉన్నారు. త్వరలో క్యూఆర్ కోడ్ తో కొత్త రేషన్ కార్డులు అందిస్తాం” అని నాదెండ్ల వివరించారు.

AP Assembly Session Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu nadendla manohar Paper Telugu News Ration rice rice seized Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.