📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Amaravati : రూ.595 కోట్లతో అమరావతిలో 2వ వరదనీటి పంపింగ్ స్టేషన్

Author Icon By Sudheer
Updated: February 17, 2026 • 10:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వరద ముప్పు నుంచి శాశ్వతంగా రక్షించేందుకు ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. రాజధాని అమరావతి ప్రాంతంలో వరద నీటి ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు రూ. 595.01 కోట్ల భారీ వ్యయంతో రెండో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉండవల్లి సమీపంలో ఏర్పాటు కానున్న ఈ పంపింగ్ స్టేషన్ అత్యంత శక్తివంతమైనదిగా నిలవనుంది. దీని సామర్థ్యం సెకనుకు 8,400 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసేలా డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే కొండవీటి వాగుపై 5,000 క్యూసెక్కుల సామర్థ్యంతో ఒక పంపింగ్ స్టేషన్ అందుబాటులో ఉండగా, ఇప్పుడు కొత్తగా రాబోతున్న ఈ రెండో స్టేషన్ అమరావతి లోతట్టు ప్రాంతాలకు కొండంత అండగా నిలవనుంది.

Pratyusha: కోర్టు తీర్పుపై స్పందించిన ప్రత్యూష తల్లి

ఈ ప్రాజెక్టు కేవలం నిర్మాణం వరకే పరిమితం కాకుండా, రాబోయే 15 ఏళ్ల పాటు దీని నిర్వహణ బాధ్యతలను కూడా కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థే చూసుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఇందులో భాగంగా సర్వే, డిజైన్, నిర్మాణం వంటి అన్ని దశలను సదరు సంస్థే పర్యవేక్షించాల్సి ఉంటుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు కొండవీటి వాగు నుంచి వచ్చే వరద నీరు కృష్ణా నదిలోకి సజావుగా వెళ్లేందుకు ఈ పంపింగ్ స్టేషన్లు అత్యంత కీలకం. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, భవిష్యత్తులో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా నగరం సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

2nd flood water pumping Amaravati Amaravati at a cost of Rs. 595 crore Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.