📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

20 లక్షల మందికి ఉపాధి: చంద్రబాబు

Author Icon By Vanipushpa
Updated: January 10, 2025 • 4:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అంతేకాక కొత్త ఏడాదిలో రాష్ట్రంలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని చంద్రబాబు ఆకాంక్షించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగం అధ్వానంగా మారిందని అన్నారు. తమను నమ్మిన ప్రజలు 93 శాతం స్ట్రైక్ రేట్ తో విజయాన్ని అందించారని… కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ప్రారంభించామని చెప్పారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో నిర్వహిస్తున్న నరెడ్కో ప్రాపర్టీ షోను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


భూ సమస్యలకు సంబంధించి గతంలో ఎన్నడూ చూడని విధంగా దరఖాస్తులు వస్తున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశామని చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలనేదే తమ లక్ష్యమని అన్నారు.
ప్రధాని మోదీ విశాఖకు వచ్చి రూ. 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని చంద్రబాబు తెలిపారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారని చెప్పారు. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి నిర్మాణ రంగానికి ఊతమిచ్చామని అన్నారు.

Andhra Pradesh chandra babu naidu Employment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.