📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

సోషల్ మీడియా విషయంలో తగ్గేదేలే అంటున్న రోజా

Author Icon By Sudheer
Updated: November 14, 2024 • 11:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోస్టులు పెడుతూనే ఉంటామని YCP నేత ఆర్కే రోజా స్పష్టం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకు సూపర్‌సిక్స్‌ పేరుతో ఇచ్చిన హామీల‌కు బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించ‌కుండా మోసం చేసింద‌ని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిప‌డ్డారు. బడ్జెట్‌లో సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌కు నిధులు ఎగ్గొట్ట‌డం మోసం కాదా చంద్ర‌బాబు అంటూ ఆమె నిల‌దీశారు. రాష్ట్రంలోని యువత, మహిళలు, రైతులను మోసం చంద్ర‌బాబుపై 420 కేసు ఎందుకు పెట్ట‌కూడ‌ద‌ని ఆమె ట్వీట్ చేశారు.

కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని ఆమె నిలదీశారు. ‘రాష్ట్రంలోని యువత, మహిళలు, రైతులను మోసం చేశారు. మహిళలకు రూ. 1,500, విద్యార్థులకు రూ.15 వేలు, రైతులకు రూ.20 వేలు, యువతకు రూ.3 వేలు ఎగ్గొట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతాం’ అని ఆమె ట్వీట్ చేశారు.

చంద్రబాబు ఇచ్చిన హామీలు ఆచరణలో పెట్టకపోవడం, ప్రజలను మోసం చేసినట్లే అని రోజా పేర్కొన్నారు. మీరు ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా మహిళలకు, యువతకు, రైతులకు ఇచ్చిన ఆర్థిక సహాయం, ఉచిత బస్సు ప్రయాణం, మరియు ఇతర సామాజిక సంక్షేమ పథకాలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారని రోజా ప్రశ్నించారు.ఈ హామీల విషయంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, మరియు సామాజిక మీడియా యాక్టివిస్టులు పోస్టులు పెడుతూనే ఉంటామన్నారు.

Chandrababu rk roja TDP ycp

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.