📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

వైపీసీవల్లే గ్యారంటీలు ఆలస్యం: లోకేష్

Author Icon By Vanipushpa
Updated: January 6, 2025 • 12:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే 6 గ్యారంటీలు ఆలస్యం అవుతున్నాయని ఐటీ, విద్యామంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ బకాయిలను తాము చెల్లిస్తున్నామన్నారు. ప్రతి నెల రూ.4 వేల కోట్ల లోటు బడ్జెట్ తో ప్రభుత్వం నడుస్తోందన్నారు. 6 గ్యారంటీల్లో రెండు అమలు చేశామని, మరో రెండు గ్యారంటీలకు డేట్స్ ఇచ్చామన్నారు. 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని లోకేష్ తెలిపారు.


ముందుగా తల్లికి వందనం, రైతు భరోసా
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయినా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీ కేబినెట్ భేటీలో ఈ ఏడాది అమలు చేయాల్సిన పథకాలపై కీలక చర్చ జరిగింది. ఇందులో తల్లికి వందనం, రైతు భరోసా ముందుగా అమలు చేయాలని, ఆ తర్వాతే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ ఏడాది కూడా సూపర్ సిక్స్ హామీలు అమలు కావడం లేదని వైసీపీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ, విద్యామంత్రి నారా లోకేష్ ఇవాళ దీనిపై క్లారిటీ ఇచ్చేశారు.

మంత్రి నారా లోకేష్ ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఉండి, కాళ్ళ, భీమవరం ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉండి హైస్కూల్ అభివృద్ధి పనుల్ని లోకేష్ ప్రారంభించారు. అలాగే కాళ్ల మండలం పెద ఆమిరం జువ్వలపాలెం రోడ్ లో రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

6 guarantee Andhra Pradesh Nara Lokesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.