వివేకా హత్య కేసు – భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

Read Time:  1 min
viveka murder case baskar r
viveka murder case baskar r
FONT SIZE
GET APP

వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో నిందితుడు భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపింది. సునీత పిటిషన్‌లో భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరగా, ఈ పిటిషన్‌ను సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌తో కలిసి పరిశీలించాలని నిర్ణయించింది.

ఈ కేసులో సుప్రీం కోర్టు.. భాస్కర్ రెడ్డి తో పాటు సీబీఐ, ఇతర ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసింది. సీబీఐ ఇప్పటికే భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. తాజా విచారణలో, సునీత పిటిషన్‌కు కూడా ప్రాముఖ్యతనిస్తూ, మార్చి మొదటి వారంలో తదుపరి విచారణకు తేదీని ఖరారు చేసింది. వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్ రెడ్డిని గతంలో సీబీఐ అరెస్ట్ చేసి జైలుకు పంపింది. అయితే, తెలంగాణ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో, ఈ నిర్ణయాన్ని సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.

వైఎస్ సునీత, తన తండ్రి వివేకానందారెడ్డి హత్య కేసులో న్యాయం జరగాలని గత కొంతకాలంగా పోరాడుతున్నారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్, కేసులో కీలక మలుపుగా నిలవనుంది. సీబీఐ నోటీసుల సమర్థన, సునీత వాదనలు కలిపి, భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు అంశంపై సుప్రీం కోర్టు పునరాలోచన చేసే అవకాశం ఉంది.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.