📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

వాలంటీర్లకు మరో షాక్ – మొబైల్ యాప్‌లో హాజరు ఆప్షన్ తొలగింపు

Author Icon By Sudheer
Updated: November 28, 2024 • 11:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లకు వరుస షాకులు తగ్గడం లేదు. వాలంటీర్ల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్లు తయారైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వానికి పూర్తిగా సపోర్టుగా నిలిచి, కూటమి పార్టీలకు వ్యతిరేకంగా ప్రచారం కూడా చెయ్యడంతో.. ఇప్పుడు వాలంటీర్ల పట్ల కూటమి ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోంది. వారిని వాలంటీర్లుగా కాకుండా.. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామన్న ప్రభుత్వం ఆ పని చెయ్యలేకపోయింది. దాంతో వాలంటీర్ల కెరీర్ గందరగోళంలో పడింది.

5 నెలలుగా ఉద్యోగ భద్రత కల్పించాలని, రూ. 10 వేల జీతం పెంచాలని ఆందోళన చేస్తున్న వాలంటీర్లకు మరో పెద్ద షాక్ తగిలింది. గ్రామ అవార్డు సచివాలయ శాఖకు సంబంధించిన మొబైల్ యాప్ లో వాలంటీర్లు హాజరు వేసుకునేటువంటి ఆప్షన్ను… తాజాగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొలగించడం జరిగింది. ఇకపై వాళ్లు హాజరు వేసుకోవడానికి అవకాశం లేకుండా చేశారు. వారం కిందటి వరకు ఈ సదుపాయం ఉండగా…. మంత్రి వీరాంజనేయ స్వామి వాలంటీర్ వ్యవస్థలో తాము లేమని ప్రకటించడంతో మొబైల్ యాప్ లో హాజరు వేసుకునే ఆప్షన్ ను తొలగించారట. దీంతో ఏపీ వాలంటీర్లు రోడ్డున పడినట్లు అయింది. వాలంటీర్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వమే రద్దు చేసిందని.. ఇటీవల ఏపీ శాసనమండలిలో మంత్రి బాలవీరాంజనేయస్వామి తెలిపారు. అసలు వాలంటీర్ వ్యవస్థే ఏపీలో లేదన్న ఆయన.. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చెయ్యలేదని తెలిపారు. 2023 సెప్టెంబర్‌తోనే వాలంటీర్ వ్యవస్థకు గడువు కాలం ముగిసిందన్నారు. ఆ తర్వాత రెన్యువల్ చేయించకపోవడం వల్ల.. అప్పటి నుంచి ఏపీలో వాలంటీర్ వ్యవస్థ లేదన్నారు. అందుకే వాలంటీర్లకు జీతాలు ఇవ్వట్లేదు అన్నారు.

AP Volunteers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.