हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన పోసాని..

Sudheer
రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన పోసాని..

సినీ నటుడు , వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి కీలక నిర్ణయం తీసుకున్నాడు.తాజాగా గురువారం మీడియా సమావేశం నిర్వహించిన పోసాని.. ఈ ప్రకటన చేశారు. తాను ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని.. అయితే మంచి చేసిన వారిని ప్రశంసించానని.. తప్పులు చేసిన వారిని విమర్శించినట్లు చెప్పారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తాను చాలా సార్లు పొగిడానని వెల్లడించారు. తాను రాజకీయ నాయకులు, పార్టీల తీరు, విధానాల గురించి విమర్శలు చేస్తుంటాను తప్ప.. మంచి నాయకులను ఎప్పుడూ తిట్టలేదని తెలిపారు. త‌న జీవితాంతం రాజ‌కీయాల జోలికి వెళ్ల‌న‌ని అన్నారు. ఇన్నేళ్ల జీవితంలో తాను ఎవ‌రికీ త‌ల వంచ‌లేద‌ని ఆడవాళ్ల‌నే ఇష్టం వ‌చ్చినట్టు తిడుతున్నారు నన్ను తిట్టరా అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అవేవీ తాను ప‌ట్టించుకోన‌ని చెప్పుకొచ్చారు. ఇన్ని సంవ‌త్స‌రాల పాటు త‌న‌ను ఆద‌రించార‌ని కానీ ఈ రోజు నుండి తాను చ‌నిపోయేవ‌ర‌కు త‌న కుటుంబం కోసమే మాట్లాడ‌తాన‌ని స్ప‌ష్టం చేశారు. ఏ రాజ‌కీయ నాయ‌కుని గురించి మాట్లాడ‌నని చెప్పారు.

త‌న‌కు మోడీ అంటే చాలా ఇష్ట‌మ‌ని అవ‌స‌ర‌మైతే ఆయ‌న‌ను పొగుడుతాన‌ని అన్నారు. వైఎస్ జ‌గ‌న్ అంటే త‌న‌కు చచ్చేంత అభిమానం అని ఆయ‌న త‌న‌కు ఎంతో గౌర‌వం ఇచ్చార‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ ఇక‌పై జ‌గ‌న్ గురించి కానీ చంద్ర‌బాబు గురించి కూడా మాట్లాడ‌నని తెలిపారు. ఇక చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌లను వైసీపీ నేత పోసాని .. అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపై ఇప్పటికే ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇదే కాకుండా ఏపీలోని పలు పోలీస్‌ స్టేషన్లలోనూ పోసానిపై అనేక కేసులు నమోదయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడిని ఏకవచనంతో సంబోధించడమే కాకుండా.. తిరుమల కొండపై దోపిడీ చేయడానికి వచ్చారంటూ పోసాని చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోసానిపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పడం గమనార్హం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870