📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

రఘురామ కేసులో ప్రభావతికి షాకిచ్చిన హైకోర్టు

Author Icon By Vanipushpa
Updated: January 10, 2025 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై అక్రమ కేసులను మోపుతున్నది. తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన వ్యవహారంలో డాక్టర్ ప్రభావతికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం డాక్టర్ ప్రభావతి వేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. కేసు దర్యాప్తు దశలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో జిల్లా సెషన్స్ కోర్టు కూడా ప్రభావతి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం నర్సాపురం ఎంపీగా ఉన్న సమయంలో రఘురామపై థర్డ్‌ డిగ్రీని ప్రయోగించిన కేసులో గుంటూరు ప్రభుత్వాస్పత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ముందుగా జిల్లా సెషన్స్‌కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ కోసం ఆశ్రయించగా.. అందుకు కోర్టు నిరాకరించింది. దీంతో ప్రభావతి హైకోర్టులో పిటిషన్ వేశారు.

అయితే హైకోర్టుకు కూడా ప్రభావతి పిటిషన్‌ను కొట్టివేసింది. కస్టోడియల్ టార్చర్ అనంతరం సంబంధిత డాక్టర్లు రఘురామకు దెబ్బలు తగిలాయని నివేదికలు ఇచ్చారు. అయితే ప్రభావతి ఆ నివేదికను మార్చి.. ఆయనకు ఎటువంటి గాయాలు అవలేదని నివేదిక ఇచ్చారని పోలీసులు అభియోగం మోపారు.

ఈ కేసుకు సంబంధించి రఘురామ.. గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయగా నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభావతి, విజయపాల్, తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్, అప్పటి ఇంటలిజెన్స్ బాస్‌గా ఉన్న పీఎస్‌ఆర్ ఆంజనేయులు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా నిందితులుగా ఉన్నారు. అయితే వాళ్లు ముగ్గురు కూడా ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టుకు వెళ్లలేదు.

Andhra Pradesh anticipatory bail doctor prabhavathi High court

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.