📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

మైనారిటీల బడ్జెట్ ను ఇతర పథకాలకై దారిమళ్లించ కూడదు

Author Icon By Uday Kumar
Updated: December 10, 2024 • 5:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
మైనారిటీల బడ్జెట్ ను ఇతర పథకాలకై దారిమళ్లించ కూడదు జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు సయ్యద్ షాహెజాది

అమరావతి, డిశంబరు 10: మైనారిటీల బడ్జెట్ ను మైనారిటీల సంక్షేమానికే వినియోగించాలని, ఇతర పథకాల అమలుకై ఆ నిధులను దారి మళ్లించ కూడదని జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు శ్రీమతి సయ్యద్ షాహెజాది అన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్రంలో ప్రధాన మంత్రి కొత్త 15 పాయింట్ల కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర స్థాయి సమావేశం ఆమె అద్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి కొత్త 15 పాయింట్ల కార్యక్రమాన్ని కేంద్ర అమలు పరుస్తున్నదని, ఈ పథకాన్నిరాష్ట్రంలో పటిష్టంగా అమలు పర్చాలని లైన్ డిపార్టుమెంట్ అధికారులను ఆమె ఆదేశించారు. మైనారిటీల ఆర్థిక పరిస్థితులను మెరుగు పర్చేందుకు పెద్ద ఎత్తున ఎంఎస్ఎమ్ఇ లను పెట్టుకునేలా వారిని ప్రోత్సహించాలన్నారు. మైనారిటీల్లో బాల కార్మికులు ఎక్కువగా ఉంటారని, అటు వంటి విధానాన్ని ప్రోత్సహించే వ్యక్తులు, సంస్థలపై పెద్ద ఎత్తున కేసులు పెట్టాలన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మైనారిటీ యువతులు యుక్తవయస్సులోనే గర్భధారణ ఎక్కువ ఉంటుందనే విషయాన్ని ఆమె తెలుసుకుని, ఇటు వంటివి పునరావృతం కాకుండా వారిలో సరైన అవగాహన కల్పించాలని, అందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలను ఆషా, ఆరోగ్య కార్యకర్తలతో నిర్వహించాలని అధికారులకు ఆమె సూచించారు. ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం క్రింద చేపట్టిన పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, వసతి గృహాల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు.

#AndhraPradesh #BreakingNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.