📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

మూతబడ్డ శ్రీవారి వైకుంఠ దర్శనం కౌంటర్లు

Author Icon By Vanipushpa
Updated: January 9, 2025 • 12:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల శ్రీవారి వైకుంఠ దర్శనం టికెట్ కౌంటర్లు క్లోజ్ అయ్యాయి. గురువారం తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు టికెట్లు జారీ చేసిన టీటీడీ సిబ్బంది.. మొత్తం 1.20 లక్షల టికెట్లను భక్తులకు జారీ చేశారు. ముందుగా నిర్ణయించిన కోటా పూర్తికావడంతో కౌంటర్లు క్లోజ్ చేశారు. ఈ నెల 13న తిరిగి వైకుంఠ దర్శన టికెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రోజూ 40 వేల టికెట్ల చొప్పున ఏరోజుకు ఆరోజు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద వైకుంఠ దర్శన టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఈ నెల 10, 11, 12 తేదీల్లో వైకుంఠ దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మూడు రోజులకు స్వామి వారి దర్శన టోకెన్లను 1.20 లక్షల భక్తులకు జారీ చేశామని పేర్కొంది. ఈ నెల 18వ తేదీ వరకు శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తామని తెలిపింది. 12వ తేదీ వరకు దర్శన టోకెన్లను ఇప్పటికే జారీ చేశామని, 13వ తేదీ నుంచి ఏరోజుకు ఆరోజు టోకెన్లు జారీ చేస్తామని వివరించింది. కాగా, వైకుంఠ దర్శన టోకెన్ల కోసం బుధవారం రాత్రి తిరుపతిలో తొక్కిసలాట జరగగా ఆరుగురు భక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ విషాదం తర్వాత భద్రతా సిబ్బందితో పరిస్థితిని చక్కదిద్దిన టీటీడీ.. గురువారం ఉదయం టోకెన్లను జారీ చేసింది.

Andhra Pradesh closed ttd counters

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.